Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్తో వన్డే, టీ20 సిరీస్కు జట్టు ప్రకటన
మెల్బోర్న్: భారత్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో తలపడే ఆసీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు(సీఏ) ప్రకటించింది. గురువారం ప్రకటించిన 18మంది సభ్యుల ఆసీస్ బృందంలో యువ ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనుండగా.. ఆల్రౌండర్ హెన్రిక్ కూడా చోటు దక్కించుకున్నారు. 21ఏండ్ల గ్రీన్ గతవారం న్యూ సౌత్వేల్స్పై 197పరుగులు, సౌత్ ఆస్ట్రేలియాపై అర్ధసెంచరీతో సత్తా చాటాడు. న్యూ సౌత్ వేల్స్కు చెందిన ఆల్రౌండర్ హెన్రిక్ మూడేండ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికైనట్టు చీఫ్ సెలెక్టర్ ట్రేవర్ హాన్స్ మీడియాతో తెలిపారు. ఇక మిఛెల్ మార్ష్, స్పిన్నర్ నాథన్ లియాన్కు పరిమిత ఓవర్ల క్రికెట్లో చోటు దక్కలేదు. భారత్తో సిరీస్లో భాగంగా నవంబర్ 27 నుంచి వన్డే, డిసెంబర్ 4నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. అనంతరం నాలుగు టెస్టుల సిరీస్ ఇరుజట్ల మధ్య ప్రారంభం కానుంది.
వన్డే, టీ20 సిరీస్కు ఆసీస్ జట్టు:
ఫించ్(కెప్టెన్), అబాట్, అగర్, క్యారీ, కమిన్స్, గ్రీన్, హేజిల్వుడ్, హెన్రిక్స్, లబుషేన్, మాక్స్వెల్, డేనియల్ శామ్స్, రిచర్డ్సన్, స్మిత్, స్టార్క్, స్టోయినిస్, వేడ్, వార్నర్, జంపా.