Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశలు నిలిపిన రాణా
- కోల్కతా నైట్రైడర్స్ 172/6
దుబాయ్: యువ బ్యాట్స్మన్ నితీష్ రాణా ఒంటరి పోరాటానికి తోడు చివర్లో మోర్గాన్, దినేష్ కార్తీక్ చెలరేగడంతో కోల్కతా నైట్ రైడర్స్ భారీస్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా ఓపెనర్ నితీష్ రాణా(87; 61 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
తొలి వికెట్కు రాణా-శుభ్మన్ కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఓవర్లోనే శుభ్మన్ గిల్ రెండు.. నితీశ్ రాణా ఒక ఫోర్ కొట్టి 13 పరుగులు రాబట్టారు. ఆ తర్వాతి చెన్నై కట్టుదిట్టంగా బంతులేయడంతో కోల్కతా స్కోర్ వేగం తగ్గింది. సాంట్నర్ వేసిన ఆరో ఓవర్లో రాణా రెండు ఫోర్లు, సిక్సర్ బాదడంతో పవర్ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా వికెట్లేమీ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. కరణ్ శర్మ బౌలింగ్లో గిల్ ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్(7) నిరాశపరిచాడు. ఈ క్రమంలో రాణా 44 బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు బ్యాట్స్మెన్ సహకారం లభించనప్పటికీ రాణా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాడు. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్ల బాది 19 పరుగులు, చాహర్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 11 పరుగులు రాబట్టాడు. వరుస బౌండరీలతో సెంచరీ వైపు దూసుకెళ్తున్న రాణాను ఎంగిడి ఔట్ చేశాడు. రింకూ సింగ్(11) మిడిలార్డర్లో నిరాశపరిచాడు. ఆఖరి ఓవర్లలో మోర్గాన్(15; 12 బంతుల్లో 2 ఫోర్లు), కార్తీక్(21నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు) చెలరేగడంతో కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఎన్గిడికి రెండు, సాంట్నర్, జడేజా, కరణ్ శర్మకు తలా ఒక వికెట్ దక్కాయి. ఇప్పటివరకు ముంబయి 16 పాయింట్లతో ప్లే-ఆఫ్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకోగా.. ఆఖరి రెండు మ్యాచ్లు ఆడాల్సిన మిగతా జట్ల ప్రదర్శనను బట్టి మిగతా మూడు బెర్త్లు ఖాయం కానున్నాయి. ఢిల్లీ, బెంగళూరు జట్లు ఒక్క విజయం సాధించినా ప్లే-ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోనుండగా.. పంజాబ్, కోల్కతా, సన్రైజర్స్, రాజస్తాన్ జట్లు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లే-ఆఫ్కు చేరే అవకాశముంది.
స్కోర్బోర్డు..
కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: శుభ్మన్ (బి)కరణ్ శర్మ 26, నితీష్ రాణా (సి)కర్రన్ (బి)ఎన్గిడి 87, నరైన్ (సి)జడేజా (బి)సాంట్నర్ 7, రింకూ సింగ్ (సి)రాయుడు (బి)జడేజా 11, మోర్గాన్ (సి)గైక్వాడ్ (బి)ఎన్గిడి 15, దినేష్ కార్తీక్ (నాటౌట్) 21, త్రిపాఠి (నాటౌట్) 3, అదనం 2. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 172 పరుగులు.
వికెట్ల పతనం: 1/53, 2/60, 3/93, 4/137, 5/167.
బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-31-0, కర్రన్ 3-0-21-0, ఎన్గిడి 4-0-34-2, సాంట్నర్ 3-0-30-1, జడేజా 3-0-20-1, కరణ్ శర్మ 4-0-35-1.