Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్
సోనెపట్ : టోక్యో ఒలింపిక్స్లో పతకం ఆశిస్తున్న, దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్కు 74 కేజీల విభాగంలో సవాల్ విసరనున్న స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డాడు. ఈ మేరకు భారత క్రీడా ప్రాధికారిక సంస్థ (సారు) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. నర్సింగ్ యాదవ్తో పాటు 77 కేజీల గ్రీకో రోమన్ విభాగం రెజ్లర్ గుర్ప్రీత్ సింగ్, ఫిజియోథెరపిస్ట్ విశాల్ రావ్లు కోవిడ్ పాజిటివ్గా తేలారు. ఈ ముగ్గురు శనివారం సోనెపట్లోని భగవాన్ మహవీర్ దాస్ హాస్పిటల్లో చేరారని సారు తెలిపింది. దీపావళి పండుగ కోసం ఇండ్లకు వెళ్లిన రెజ్లరు.. విరామం తర్వాత సారు సోనెపట్ కేంద్రానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం అందరికీ నిర్వహించిన కరోనా ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఈ ముగ్గురు పాజిటివ్గా తేలారు. క్వారంటైన్లో ఆరో రోజు వీరికి పరీక్షలు నిర్వహించగా, శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. నర్సింగ్ యాదవ్, గుర్ప్రీత్ సింగ్, విశాల్ రావులకు కోవిడ్ లక్షణాలు లేవని సారు వర్గాలు వెల్లడించాయి.