Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కొత్త రికార్డును సాధించారు. ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాట్స్మెన్ గా విమర్శకుల ప్రశంసలను లందుకున్న విరాట్ కోహ్లీ. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కారు.
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ
సచిన్ వారసుడిగా జట్టులోకి వచ్చిన కోహ్లీ ఆటలో తన ప్రతిభా ప్రదర్శనతో కొద్దికాలంలోనే కెప్టెన్ గా ఉన్నాడు. క్రికెట్ సమాజంలో ఈ కోహ్లీ 'పరుగుల యంత్రం' రికార్డుల ఢంకా మోగిస్తోంది. విరాట్ కోహ్లీ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని తన పరుగుల రికార్డులను చూస్తే అర్థం అవుతుంది. తన కెరీర్లో 251 మ్యాచులాడిన కోహ్లీ 242 వ ఇన్నింగ్స్ లో 12 వేల మైలురాయిని అందుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ 12 వేల పరుగులను చేయడానికి 309 ఇన్సింగ్స్ తీసుకున్నారు.
462 ఇన్నింగ్స్లో 22 వేల పరుగుల రికార్డు
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ 22 వేల పరుగులను పూర్తి చేశారు. దీనికి కోహ్లీ కేవలం 462 ఇన్నింగ్స్ తీసుకున్నారు. దిగ్గజ క్రికెటర్స్ అయిన సచిన్ 493, బ్రియన్ లారా 511, రికీ పాంటింగ్ 514 ఇన్సింగ్స్లలో ఈ ఘనతను సాధించారు. వన్డేలో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరుండగా.. ఆస్ట్రేలియా నుండి రికీ పాంటింగ్, శ్రీలంక నుండి ముగ్గురు ఆటగాళ్లు ఉండటం గమనార్హం.
వన్డేలో 12 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
1.విరాట్ కోహ్లీ (242 ఇన్నింగ్స్)
2. సచిన్ తెందూల్కర్ (300)
3. రికీ పాంటింగ్ (314)
4. కుమార సంగక్కర (336)
5. సనత్ జయసూర్య (379)
6. మహేల జయవర్దనే (399)