Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీ ట్రోఫీ నిర్వహణపై బీసీసీఐ
ముంబయి : 2020-21 దేశవాళీ క్రికెట్ సీజన్ నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2020 సీజన్ను బయో బబుల్లో విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ.. నాలుగు ఆప్షన్లతో కూడిన లేఖను ఇటీవల రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిన సంగతి తెలిసిందే. మెజార్టీ రాష్ట్ర క్రికెట్ సంఘాలు రంజీ ట్రోఫీని కాదని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజరు హజారే వన్డే ట్రోఫీలపై మొగ్గుచూపినట్టు సమాచారం. రంజీ ట్రోఫీ చాంపియన్ సౌరాష్ట్ర, ముంబయి, తమిళనాడు, బరోడా, విదర్భ సహా బెంగాల్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్కే ఓటేసినట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అన్ని ఫార్మాట్ల నిర్వహణకు ఆసక్తి చూపటంతో పాటు ఎనిమిది ఫస్ట్ క్లాస్ క్రికెట్ గ్రౌండ్లతో ఆతిథ్య ఆఫర్ను సైతం బోర్డుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. రంజీ ట్రోఫీలో 38 జట్లు పోటీపడతాయి. జోన్ల వారీగా మ్యాచులు నిర్వహించినా.. ఎక్కడ సమస్య వచ్చినా బాధ్యత వహించటం సమస్యగా మారుతుంది. అందుకే ఈ సీజన్లో రంజీ ట్రోఫీ నిర్వహించకుండా.. దేశవాళీ క్రికెటర్లు, అంపైర్లు, స్కోరర్లు, ఇతర సిబ్బందికి మ్యాచ్ ఫీజులు ఇవ్వాలనే ఆలోచన సైతం బోర్డుకు ఉందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఆట నిలిచిపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయో సెక్యూర్ బబుల్ నిర్వహణ భారమని రంజీ ట్రోఫీ రద్దు చేస్తే.. దేశవాళీ క్రికెటర్లు ఆర్థికంగా మరింత నష్టపోతారు. అందుకే పరిమిత ఓవర్ల ఫార్మాట్ నిర్వహించి.. రంజీ ట్రోఫీకి సంబంధించి మ్యాచు ఫీజులను క్రికెటర్ల ఖాతాలకు బదిలీ చేసే అంశాన్ని బోర్డు సీరియస్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది