Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ వైపు బీసీసీఐ చూపు
- కరుణించకపోతే 906 కోట్లు చెల్లించాలి.
- సౌరవ్ గంగూలీ,జైషా
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇపుడు మోడీ సర్కార్ వైపు చూస్తున్నది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తున్న బోర్డు... పన్ను మినహాయింపు ఇచ్చే విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బీసీసీఐ అధ్యక్ష,కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జైషాలను సూచించింది. అయితే పన్ను మినహాయింపు ఇవ్వకపోతే ఐసీసీకీ ఎంత కట్టాలి..? కొద్దిగా వెసులుబాటు కల్పిస్తే...ఎంత చెల్లించాలి. ఇలాంటి ఇంట్రస్టింగ్ అంశాలు...
ముంబయి
టీ -20 ప్రపంచ కప్ భారతదేశంలో రెండోసారి జరగనున్నది. ఈ టోర్నమెంట్ ఈ అక్టోబర్లో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. భారత్ రెండోసారి టీ 20 ప్రపంచ కప్కు ఆతిథ్యమివ్వనున్నది. అంతకుముందు 2016 లో ఈ టోర్నమెంట్ భారతదేశంలో నిర్వహిస్తే.. వెస్టిండీస్ టైటిల్ గెలుచుకుంది. అయితే టీం ఇండియా ఈ టోర్నమెంట్ను 2007 లో ఒకసారి మాత్రమే గెలిచింది. అప్పుడు జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఓడిపోయింది.
పన్ను మినహాయింపుపై రగడ
కేంద్రం చొరవచూపి మినహాయింపు ఇస్తే సరి. లేకపోతే ఐసీసీకి బీసీసీఐ రూ .906 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కొద్దిగా పన్ను మినహాయింపు ఇచ్చినా..కనీసం రూ .227 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా పన్ను మినహాయింపుపై ఐసీసీ,భారత్ క్రికెట్ బోర్డు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్నది.
రెండు అవకాశాలు చేజారే..
2019 డిసెంబర్ 31, 2020 డిసెంబర్ 31 తేదీలు ఇచ్చినా బీసీసీఐ ట్యాక్స్ మినహాయింపు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని ఐసీసీ అంటున్నది. మరో అవకాశంగా భారత్ క్రికెట్ బోర్డుకు 2021 ఫిబ్రవరి నెలాఖరు గడువిచ్చింది. ఒక వేళ ఈ అవకాశాన్ని కూడా బీసీసీఐ జారవిడుచుకుంటే..భారత్ ఆతిథ్యం మిచ్చే ఛాన్స్ కోల్పోతుంది. ఈ తరుణంలో ఆతిథ్యమిచ్చే ప్రత్యామ్నాయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి దక్కనున్నది.
ఐసీసీ భారత క్రికెట్ బోర్డుకు ఇచ్చిన ఆప్షన్లు ఇవే..
1. టీ-20 ప్రపంచకప్ను యూఏఈకి షిప్ట్ చేద్దాం..
ట్యాక్స్ మినహాయింపునకు ఆఖరి ఛాన్స్ ఫిబ్రవరి నెలే
2.ఒకవేళ కేంద్రం పన్ను మినహాయింపు వెసులు బాటు ఇవ్వకపోతే...సుమారు 226.58 కోట్ల నుంచి గరిష్టంగా 906.33 కోట్లు బీసీసీఐ ఖాతాలోనుంచే చెల్లించాలి.
2016లోనే మొదలైన వివాదం
ఐసీసీ,బీసీసీఐల మధ్య పన్ను మినహాయింపు వివాదం నడుస్తూనే ఉన్నది. తొలిసారి 2016 టీ..20 ప్రపంచకప్ నిర్వహించేటపుడు కూడా లొల్లిగా మారింది. ఈ టోర్నమెంట్ భారత్లో నిర్వహించగా...మోడీ సర్కార్ ఎలాంటి పన్ను మినహాయింపు ఇవ్వలేదు. దీనివల్ల సుమారు 150 నుంచి 230 కోట్లు (20..30 మిలియన్డాలర్లు) ఐసీసీకి నష్టం వాట్లిలిందని అధికార వర్గాలు తెలిపాయి.
2018లోనే ఐసీసీ హెచ్చరిక చేసినా..
2016లో బీసీసీఐ చేతులెత్తేయటంతో...2018 ఫిబ్రవరి నెలలో మరో దఫా ఐసీసీ హెచ్చరిక చేసింది. ఇప్పటికీ మేలుకోకపోతే..2021లో టీ..20, 2023 నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్ ఆతిథ్య అవకాశాలను కోల్పోవటం ఖాయమని ఐసీసీ స్పష్టం చేసింది.
క్రికెట్ ప్రసారాలతోనే ఐసీసీకి ఆదాయం
గత ఎనిమిదేండ్లుగా ఐసీసీ మహిళా,పురుషులు ఆడే టీ-20, వన్డే, అండర్-19 వరల్డ్ కప్ మ్యాచుల ప్రసారాలను టెండర్ల ద్వారా ఖరారు చేస్తున్నది. అలా వచ్చిన ఆదాయంతోనే ఐసీసీ కొనసాగుతున్నది. అయితే ఆతిథ్యదేశాలన్నీ పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ భారత్ ఒక్క దేశమే పన్ను మినహాయింపు ఇవ్వటంలేదని ఐసీసీ అంటున్నది.
అమిత్షా తనయుడి కోసం...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, అమిత్షా తనయుడు బీసీసీఐలో కార్యదర్శిగా ఉన్న జై షా కోసం పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయుపడుతున్నారు. ఇందులో భాగంగానే సౌరవ్ గంగూలీ బీజేపీ పెద్దలతో టచ్ ఉంటున్నారనీ వారంటుంటే..దీన్ని రాజకీయం చేయాలని కమలదళం భావిస్తున్నదని మరికొందరి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో టీ-20 ఆతిథ్యం భారత్ చేతిలో ఉంటుంగా, లేక యూఏఈ ఎగరేసుకుపోతుందా..ఎదురుచూడాల్సిందే..