Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పతకాలపై అభినవ్ బింద్రా ఆశాభావం
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో భారత షుటింగ్ బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం సాధించిన దిగ్గజ షుటర్ అభినవ్ బింద్రా విశ్వాసం వ్యక్తపరిచాడు. ' కోవిడ్19 మహమ్మారితో సవాళ్లతో కూడిన పరిస్థితులు చవిచూస్తున్నా, టోక్యో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామనే నమ్మకం ఉంది. స్క్రిప్ట్ ప్రకారం క్రీడలు సాగవు. కానీ టోక్యో ఒలింపిక్స్లో భారత్ బలంగా పుంజుకుంటుందని అనుకుంటున్నాను. షుటింగ్లో 5-6 పతకాలు వస్తాయనే అంచనా ఉంది. లండన్ కంటే మెరుగైన పతకాలు.. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా అదే అత్యుత్తమ కానుంది. భారత షుటింగ్ బృందంలోని ప్రతి ఒక్కరికీ మెడల్ సాధించగల సత్తా, సామర్థ్యం ఉన్నాయి. షుటింగ్తో పాటు ఇతర క్రీడాంశాల్లోనూ పతకాలు సాధించగల క్రీడాకారులు ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్కు మనం చాలా మంది మెడల్ విన్నర్స్ అంచనాలతో వెళ్లనున్నాం. అయితే, పతకం సాధించటం ఆ రోజును బట్టి ఆధార పడి ఉంటుంది' అని బింద్రా అన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఓ ఏడాది పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.