Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి
సిడ్నీ : క్రికెట్ వ్యాఖ్యానంలో మాంత్రికుడు, భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్పై ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు. బోరెల్ మ్యూజియం కోసం ప్రత్యేకంగా గీసిన సునీల్ గవాస్కర్ ఫోటోను బుధవారం రవిశాస్త్రి సిడ్నీ మైదానంలో ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా సన్నీపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ' నేను చూసిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో సునీల్ గవాస్కర్ అత్యుత్తమం. అతడి సారథ్యంలో ఆడటం నాకు దక్కిన గౌరవం. అతడు వ్యూహల మాంత్రికుడు. ఏదీ గవాస్కర్ దృష్టి మరల్చలేదు. వెస్టిండీస్పై అతడు సాధించిన 13 సెంచరీలు, అతడు ఆడిన తీరుకు అద్దం పడతాయి. గవాస్కర్ కెరీర్ ఉజ్వల స్థితిలో ఉన్నప్పుడు అతడిని ముంబయి బ్రాడ్ మన్ అని పిలిచేవారు. గవాస్కర్ ఫోటోను ఆవిష్కరించటం గౌరవంగా భావిస్తున్నాను' అని రవిశాస్త్రి అన్నాడు.