Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గబ్బా టెస్టులో భారత్కు ఒకే బంతికి రెండు దెబ్బలు తగిలాయి. వాస్తవికంగా చెప్పాలంటే, కాస్త గట్టిగానే తగిలాయి. సిరీస్లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా నం.3 బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ను అవుట్ చేసే అవకాశం చేజారటంతో పాటు జట్టులోని రెండో సీనియర్ పేసర్ నవదీప్ సైని గాయంతో మైదానం వీడటం భారత్ను దెబ్బకొట్టాయి. స్టీవ్ స్మిత్ నిష్క్రమించిన కొద్దిసేపటికే మార్నస్ లబుషేన్ సైతం దాదాపుగా అవుటయ్యాడు. కండ్లుచెదిరే బంతిని విసిరిన నవదీప్ సైని మార్నస్ లబుషేన్ను ఆశ్చర్యపరిచాడు. మార్నస్ లబుషేన్ హుక్ చేయబోగా.. బంతి బ్యాట్కు ఎడ్జ్ తీసుకుంది. గల్లీలో ఉన్న అజింక్య రహానె సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు, విలువైన జీవనదానంతో మార్నస్ లబుషేన్ సిరీస్లో తొలి సెంచరీ కొట్టేశాడు. 35 ఓవర్ ఐదో బంతికి మార్నస్ లబుషేన్ క్యాచ్ను రహానె వదిలేశాడు. ఆ బంతి అనంతరం నవదీప్ సైని గజ్జల్లో గాయంతో మైదానం వీడాడు. ఆ ఓవర్లో చివరి బంతిని రోహిత్ శర్మ పూర్తి చేశాడు. నవదీప్ సైని తిరిగి తొలి రోజు బౌలింగ్కు రాలేదు. అందివచ్చిన అవకాశంతో శతకబాదిన లబుషేన్ ఆసీస్ను తొలి రోజు ఆధిక్యంలో నిలిపాడు.