Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్ సంచలనం టి నటరాజన్
చెన్నై : నెట్ బౌలర్గా భారత జట్టుతో ఉన్న నట్టూ.. సిరీస్ ఆఖరులో ఏకంగా టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్గా తంగరసు నటరాజన్ రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున యార్కర్ల వర్షం కురిపించి అభిమానులను సంపాదించుకున్న నటరాజన్..సెలక్షన్ కమిటీని సైతం మెప్పించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నటరాజన్ మూడు ఫార్మాట్లలోనూ మెప్పించే ప్రదర్శన చేశాడు. శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్న నటరాజన్కు స్థానికులు మరిచిపోలేని స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు అరంగేట్రంపై నటరాజన్ మీడియాతో మాట్లాడాడు. ' నా బాధ్యతను నిర్వర్తించేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ఆస్ట్రేలియాపై వన్డే జట్టులో అవకాశాన్ని నేను ఊహించలేదు. ఆస్ట్రేలియా నా అరంగేట్రం అసలు అంచనా వేయలేదు. నేను తుది జట్టులో ఆడుతున్నానని చెప్పగానే ఎంతో ఒత్తిడికి గురయ్యాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాను. భారత్కు ఆడటం, వికెట్ పడగొట్టడం కలలా సాగిపోయింది. బారత్కు ఆడుతున్నప్పుడు నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నిజంగా అది కలే. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నుంచి ఎంతో మద్దతు లభించింది. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు, స్ఫూర్తి నింపారు. వారి అండదండలతోనే నేను మంచి ప్రదర్శన చేయగలిగాను. విరాట్ కోహ్లి, అజింక్య రహానెలు నన్ను బాగా చూసుకున్నారు. నాకు సానుకూల విషయాలు చెబుతూ ప్రోత్సహించారు. ఆ ఇద్దరి సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాదించాను. టీ20 సిరీస్ విజయం అనంతరం విరాట్ కోహ్లి ట్రోఫీని నాకు అందివ్వగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఐపీఎల్లో చాలా మంది భారత, విదేశీ క్రికెటర్లతో డ్రెస్సింగ్రూమ్ను పంచుకోవటం కలిసొచ్చింది. నా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్టు డెవిడ్ వార్నర్ నాతో చెప్పాడు. నాకు కూతురు పుట్టినందుకు నేను బాగా ఆడుతున్నానని డెవిడ్ వార్నర్ మ్యాచ్ మధ్యలో నాతో అన్నాడు' అని నటరాజన్ తెలిపాడు.