Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రా అసలు ఆప్షనే కాదు
- యువ క్రికెటర్ రిషబ్ పంత్
న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్ను తన అత్యద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో కుదిపేసిన యువ సంచలనం రిషబ్ పంత్. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో రిషబ్ పంత్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్లు ఆడాడు. బ్రిస్బేన్ టెస్టులో డ్రా చేసుకుంటే, భారత్కు అది గొప్ప ఫలితంగా ఐదో రోజు ఆటకు ముందు అందరూ అనుకున్నారు. పగుళ్లతో కూడిన బ్రిస్బేన్ పిచ్పై 300కు పైగా పరుగులు సాధించటం అసాధ్యమని అందరి భావన. సహజ విధ్వంసకుడు రిషబ్ పంత్ అజేయంగా 89 పరుగులు సాధించి, గబ్బాలో భారత్కు చారిత్రక విజయాన్ని అందించాడు. రిషబ్ పంత్ విన్యాసాలకు ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయింది. భారత్కు తిరుగులేని విజయాన్ని అందించిన రిషబ్ పంత్ సిడ్నీ, బ్రిస్బేన్ ఇన్నింగ్స్లపై మీడియాతో ముచ్చటించాడు.
'ఓడిపోవటం ఎప్పుడూ ఓ ఆప్షన్ కాదు. కానీ గెలుపొందటం ఎప్పుడైనా అత్యుత్తమ ఆప్సన్. నా ఆలోచన తీరు భారత్కు విజయాన్ని అందించాలని ఉంది. ఆస్ట్రేలియా పర్యటన నిజంగా నాకు చిరస్మరణీయం. అంతిమంగా భారత్కు విజయాలు అందించటమే. భారత్కు విజయాన్ని అందించడానికి మించిన అనుభూతి మరొకటి ఉండదు. సిడ్నీ టెస్టు ఆఖరు రోజు నేను 97 పరుగులు అవుటైనా, మరింత సేపు బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ను గెలిపించేవాడినని అనుకున్నాను. బ్యాటింగ్కు రావడానికి ముందు రెండు ఇంజెక్షన్లు, మత్తుసూదులు తీసుకోవడాన్ని లెక్కచేయలేదు. విజయానికి దారితీసే ఎటువంటి అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ఆలోచనలో ఉన్నాను. బ్రిస్బేన్లో ఆఖరు వరకూ క్రీజులో ఉండాలని అనుకున్నాను' అని రిషబ్ పంత్ అన్నాడు.