Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టీ-20ల సిరీస్కు సంబంధించి భారత జట్టుకు ఎంపికైన రాహుల్ తెవాటియా విజరు హజారే ట్రోపీలో బౌండరీల వర్షం కురిపిస్తూ రెచ్చిపోయాడు. చండీగఢ్పై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హర్యానా తరఫున ఆడుతున్న తెవాటియా.. చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో 39 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీనిలో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు హిమన్షు రాణా శతకంతో రాణించాడు. దీంతో 50 ఓవర్లలో హర్యానా జట్టు 299 పరుగులు చేసింది. కాగా, ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు టీ-20ల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెవాటియాకు చోటు దక్కింది. అలాగే, ఐపీఎల్లో రాణించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ సైతం భారత జట్టుకు ఎంపికయ్యారు.