Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్ పై ఆసీస్ విజయం
వెల్లింగ్టన్ : ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ (79, 55 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు).. వేలంలో రికార్డు ధర దక్కించుకున్న న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్పై విరుచుకుపడ్డాడు. జెమీసన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. కవర్స్, ఎక్స్ట్రా కవర్, లాంగ్ ఆన్, మిడ్ వికెట్ మీదుగా అరోన్ ఫించ్ భారీ సిక్సర్లు కొట్టాడు. అరోన్ ఫించ్ వీరోచిత ఇన్నింగ్స్తో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 156/6 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ను 106 పరుగులకు కుప్పకూల్చి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో ఆరంభంలోనే తడబడిన న్యూజిలాండ్ మళ్లీ కోలుకోలేదు. మార్టిన్ గప్టిల్ (7), కేన్ విలియమ్సన్ (8), గ్లెన్ ఫిలిప్స్ (1), జేమ్స్ నీషమ్ (3), మిచెల్ శాంట్నర్ (3), టిమ్ సౌథీ (6) విఫలమయ్యారు. ఆఖర్లో కైల్ జెమీసన్ (30, 18 బంతుల్లో 5 ఫోర్లు) పోరాడినా అప్పటికే ఫలితం తేలిపోయింది. ఆసీస్ బౌలర్లు కేన్ రిచర్డ్సన్ (3/19), గ్లెన్ మాక్స్వెల్ (2/14), ఆష్టన్ ఆగర్ (2/11), ఆడం జంపా (2/24) రాణించారు. మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమం అయ్యింది. సిరీస్ నిర్ణయాత్మక సమరం ఆదివారం జరుగనుంది. అజేయ అర్థ సెంచరీతో చెలరేగిన అరోన్ ఫించ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.