Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీసీ ఈవెంట్లలో ప్రాతినిథ్యం వహించే జట్ల బృందం పరిమితి 23 నుంచి 30కి పెంచారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అన్ని జట్లు జంబో బృందాలతో పర్యటస్తున్నాయి. ఐసీసీ 2021 టీ20 ప్రపంచ కప్ నుంచి అమల్లోకి రానుంది. గతంలో 15 మంది ఆటగాళ్లు, ఎనిమిది మంది సహాయక సిబ్బందితో 23 మందినే అనుమతించేవారు. ఇప్పుడు 15 మందికి అదనంగా మరో ఏడుగురు ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బందిని జట్టులోకి తీసుకునే వెసులుబాటు కల్పించారు.