Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత్కు చెందిన అగ్రశ్రేణి అంపైర్ నితిని మీనన్ ఈ సీజన్ ఐపిఎల్కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) టోర్నమెంట్ మధ్యలోనే వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. పాల్ రీఫిల్(ఆస్ట్రేలియా) మాత్రం కొనసాగనున్నాడు. ఐసిసి ఎలైట్ ప్యానల్లో ఉన్న ఏకైక భారత అంపైర్ నితిన్ మాత్రమే. 'నిజమే.. కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా నితిన్ ఉన్నపళంగా ఐసిసి టోర్నమెంట్నుంచి వైదొలుగుతానని అన్నాడు. కుటుంబ సభ్యులకంటే ఐపిఎల్ ముఖ్యం కాదు.. అతని అభ్యర్ధనను కాదనలేకపోయామని' బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది.