Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత హాకీజట్టు మాజీ కోచ్ ఎంకే కౌషిక్(66) కోవిడ్తో కన్నుమూశారు. మూడు వారాలుగా కరోనాతో బాధపడుతున్న కౌషిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారని ఆయన కుమారుడు తెలిపాడు. మాస్కో ఒలింపిక్స్లో భారత హాకీజట్టు స్వర్ణపతకం గెలిచిన జట్టులో సభ్యుడు. ఏప్రిల్ 17న కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. నేటి ఉదయం పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. భారత హాకీ మహిళల, పురుషుల జట్లకు కోచ్గా ఉన్న సమయంలో 1998 బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో పురుషుల జట్టు స్వర్ణ పతకం, 2008 దోహా ఆసియా గేమ్స్లో మహిళల జట్టు కాంస్య పతకం గెల్చాయి. 1998లో అర్జున్ అవార్డు, 2002లో ద్రోణాచార్య అవార్డులు కౌషిక్కు దక్కాయి.