Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నెమ్మదిస్తే.. ప్రమాదమే! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

నెమ్మదిస్తే.. ప్రమాదమే!

Sat 08 Jan 03:49:25.786327 2022

- స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొత్త నిబంధనలు
- జనవరి16 నుంచి అమల్లోకి నయా రూల్స్‌
దుబాయ్ : ఆధునిక క్రికెట్‌కు ఊపుతీసుకొచ్చిన ఫార్మాట్‌ టీ20. పొట్టి ఫార్మాట్‌లో నిలకడగా ఎదురవుతున్న సమస్య స్లో ఓవర్‌రేట్‌. షెడ్యూల్‌ సమయానికి ఓవర్ల కోటా పూర్తి కాకపోవటంతో టీ20 మ్యాచులు కొన్నిసార్లు అర్థరాత్రి వరకు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. స్లో ఓవర్‌రేట్‌ ఓ దశలో టీ20 క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించేలా కనిపించింది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సరికొత్త నిబంధనలు రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్‌ అనంతరం కాకుండా మ్యాచ్‌లోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జనవరి 16న న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ టీ20 మ్యాచ్‌తో ఐసీసీ కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధన ఏమిటీ? : నిర్దేశించిన లేదా షెడ్యూల్‌ సమయానికి ఫీల్డింగ్‌ జట్టు 20 ఓవర్ల కోటా పూర్తి చేయాలి. ఒకవేళ అలా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆ జట్టు 30 గజాల సర్కిల్‌ ఆవల ఐదుగురు ఫీల్డర్ల స్థానంలో నలుగురిని మాత్రమే నిలుపుకోగలదు. ఈ నిబంధన మెన్స్‌, ఉమెన్స్‌ క్రికెట్‌కు వర్తిస్తుంది. ఐసీసీ శుక్రవారం వెల్లడించిన నూతన నిబంధన ప్రకారం షెడ్యూల్‌ సమయంలోగా ఫీల్డింగ్‌ జట్టు చివరి ఓవర్‌ను మొదలుపెట్టాలి. డ్రింక్స్‌ విరామం కోసం జట్లు ఇన్నింగ్స్‌ మధ్యలో 190 సెకండ్ల సమయం ప్రత్యేకంగా తీసుకోవచ్చు. ఓ సిరీస్‌ ఆరంభానికి ముందే ఇరు జట్లు అందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
ఓ ఇన్నింగ్స్‌ ఎంత సమయం? : ఇప్పటి వరకు ప్రతి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు 85 నిమిషాల సమయం ఉండేది. ఐసీసీ నూతన నిబంధనల ప్రకారం టీ20ల్లో 20 ఓవర్‌ను 85 నిమిషం లోగా మొదలుపెట్టాలి. ఇన్నింగ్స్‌ను ఏ సమయం లోగా పూర్తి చేయాలనే విషయాన్ని మ్యాచ్‌ అధికారులు ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందే ఫీల్డింగ్‌ జట్టు కెప్టెన్‌కు తెలియజేస్తారు. గాయాలు, డీఆర్‌ఎస్‌ సమీక్షలు, బంతి బయటపడటం, ఇతర ఏ కారణాలతో ఆలస్యం జరిగినా ఆ సమయన్ని లెక్కించి ఇన్నింగ్స్‌ ముగింపు సమయాన్ని రీషెడ్యూల్‌ చేస్తారు. మూడో అంపైర్‌ ఈ సమయాన్ని లెక్కిస్తాడు. రీ షెడ్యూల్‌ సమయాన్ని ఫీల్డ్‌ అంపైర్లతో పంచుకుంటాడు.
ప్రభావం ఎలా ఉంటుంది? : ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఈ ఫార్ములాను దేశవాళీ సర్క్యూట్‌లో అమలు చేసింది. ఐసీసీ ఈ నిబంధనలను అమలు చేయనుండటంతో భవిష్యత్‌లో మెగా టీ20 లీగ్‌లు సైతం కొత్త రూల్స్‌ను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో డెత్‌ ఓవర్లలో చివరి ఓవర్‌ అత్యంత కీలకం. 30 గజాల సర్కిల్‌ ఆవల ఐదుగురు ఫీల్డర్లతోనే బౌండరీల ప్రవాహం ఆపలేం. అలాంటిది స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఓ ఫీల్డర్‌ను బౌండరీ లైన్‌ వద్ద కోల్పోవటం ఫీల్డింగ్‌ జట్టుకు కోలుకోలేని ఎదురు దెబ్బ అవుతుంది. ఈ నిబంధనతో చివరి ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పనుందని చెప్పవచ్చు. అసలు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించనుందని చెప్పినా అతిశయోక్తి కాదు. గతంలో స్లో ఓవర్‌రేట్‌కు మ్యాచ్‌ ఫీజులో జరిమానా విధించారు. కానీ తాజా నిబంధనతో మ్యాచ్‌ ఫలితమే మారే ప్రమాదం ఉంది. దీంతో నిర్ణీత సమయంలో ఇన్నింగ్స్‌ ముగించేందుకు ఫీల్డింగ్‌ జట్లు ఇప్పుడు మెరుగైన ప్రణాళికతో వస్తాయని ఆశించవచ్చు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీదా? నాదా? సై
బాక్సింగ్‌ చాంప్‌కు రూ.4 లక్షలు
విరాట్‌కు విరామం అవసరం!
గవాస్కర్‌ వీడియోలు చూడండి!
త్రిసభ్య కమిటీ ఏర్పాటు
నిఖత్‌ జరీన్‌కు ఘన స్వాగతం
కెర్బర్‌ నిష్క్రమణ
బెంగాల్‌కు ఇక ఆడను!
ఫైనల్లో రాజస్థాన్‌
భారత్‌ 16, ఇండోనేషియా 0
రాయల్‌ సమరం
రఫెల్‌ నాదల్‌.. 300
16ఏండ్ల ప్రజ్ఞానంద మరో సంచలనం
బెంగళూరుదే గెలుపు
ఐఓఏ అధ్యక్ష పదవికి బత్రా రాజీనామా
మూడోరౌండ్‌కు జకో
మరిన్ని అపూర్వ విజయాలు సాధించాలి..
గెలిచి.. నిలిచేదెవరో?
ఆ నిర్ణయం రాహుల్‌ ద్రవిడ్‌దే!
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌
సెమీఫైనల్లో ప్రజ్ఞానంద
ఆసీస్‌ సహాయ కోచ్‌గా వెటోరీ
ఫైనల్లో టైటాన్స్‌
క్రజికోవాకు షాక్‌
భారత్‌ 1-1 పాకిస్థాన్‌
తొలి అడుగు పడేదెవరిదో?
ఉమ్రాన్‌కు పిలుపు
అభిషేక్‌ ఒక్కడే!
పుజారా వచ్చేశాడు
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన టిమ్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.