Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో శిక్షణ శిబిరానికి ఏర్పాట్లు
- హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్
లక్నో : ఆసియా మహిళల యూత్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు సన్నాహక శిబిరం ఏర్పాటు చేస్తామని జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. కజకిస్థాన్ వేదికగా మార్చి 18-27న ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే జట్టును ఈ నెల 12, 13న ట్రయల్స్ నిర్వహించి ఎంపిక చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) ఆధ్వర్యంలో త్వరలోనే శిక్షణ శిబిరానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ శిక్షణ శిబిరానికి ఎంపికైన భారత జట్టులో రాష్ట్రానికి చెందిన ఎం. కరీనా చోటు సాధించింది. ఈ శిబిరానికి హెడ్కోచ్గా మోహిందర్ లాల్ (సారు), కోచ్గా ఎం. రవికుమార్ (సాట్స్) నియమితులు అయ్యారు.