Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ చేతిలో 63పరుగుల తేడాతో ఓటమి
క్వీన్స్టౌన్: న్యూజిలాండ్తో జరిగిన నాల్గో టి20లోనూ టీమిండియా అమ్మాయిలు పరాజయాన్ని చవిచూసారు. తొలిగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీస్కోర్ను నమోదు చేసింది. అమెలియా కెర్ర్(68నాటౌట్), సూజీ బెట్స్(41) బ్యాటింగ్లో రాణించగా.. రేణుక సింగ్(2/33) బౌలింగ్లో రాణించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు 17.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రీచా ఘోష్(52) అర్ధసెంచరీకి తోడు మిథాలీరాజ్(30) మాత్రమే బ్యాటింగ్లో రాణించారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ(0), యస్టికా భాటియా(0) డకౌట్ అయ్యారు. ఓ దశలో టీమిండియా 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో మిథాలీ, రీచా కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్ 67 పరుగుల వద్ద మిథాలీ ఔట్ కావడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. హీలీ జెన్సన్(3/32) బౌలింగ్లో రాణించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో న్యూజిలాండ్ జట్టు 4-0 ఆధిక్యతలో నిలవగా.. చివరి టి20 శుక్రవారం జరగనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అమెల్లా కెర్ర్కు లభించింది.