Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తన రాజ్యసభ జీతాన్ని రైతుల బిడ్డల సంక్షేమానికి విరాళంగా ఇస్తున్నట్లు మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్బజన్ సింగ్ ప్రకటించాడు. 'ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం నా వేతనాన్ని వారికి విరాళంగా ఇస్తా. దేశ అభివద్ధి కోసం నాకు చేతనైన సహాయం చేస్తా. జై హింద్!' అని భజ్జీ తెలిపాడు. 41 ఏండ్ల హర్బజన్ గత నెల ఆమ్ఆద్మీ పార్టీ (పంజాబ్) నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.