Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బీజేపీ జెండాను చూసి మోస‌పోవద్దు : కేసీఆర్
  • రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
  • వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆశలపై వర్షం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఆశలపై వర్షం

Mon 20 Jun 05:16:47.032075 2022

- వర్షంతో ఐదో టీ20 రద్దు
- 2-2తో ట్రోఫీ ఇరు జట్ల వశం
తొలి రెండు మ్యాచుల్లో ఆతిథ్య జట్టుపై దక్షిణాఫ్రికా పంజా. మలి రెండు మ్యాచుల్లో పర్యాటక జట్టుపై భారత్‌ ఎదురులేని విజయాలు. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు చిన్నస్వామిలో రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు అభిమానులు రసవత్తర సమరంపై ఆశలు పెంచుకోగా.. వరుణుడు నీళ్లు చల్లాడు. ఆటకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ వచ్చి ఇక వెళ్లనేలేదు. ఎడతెరపి లేని వర్షంతో భారత్‌, దక్షిణాఫ్రికా ఐదో టీ20 రద్దుగా ముగిసింది.
నవతెలంగాణ-బెంగళూర్‌
ఐపీఎల్‌ అనంతరం అభిమానుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్‌ చప్పగా ముగిసింది. 2-2తో సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌ కోసం చిన్నస్వామికి చేరుకున్న ఇరు జట్లతో పాటు అభిమానులకు సైతం చేదు అనుభవం తప్పలేదు. ఊహించినట్టుగానే ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో నిర్ణయాత్మక ఐదో టీ20 నిర్వహణ సాధ్యపడలేదు. రాత్రి 9.45 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు మ్యాచ్‌ అధికారులు ప్రకటించారు. ఐదో టీ20 సమరం రద్దు కావటంతో టీ20 సిరీస్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా సంయుక్త విజేతలుగా నిలిచాయి. భారత కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌లు పొట్టి సిరీస్‌ ట్రోఫీని పంచుకున్నారు. స్వదేశంలో సఫారీలతో సిరీస్‌ను సమం చేసుకున్న టీమ్‌ ఇండియా.. తర్వాతి సమరం కోసం విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఐర్లాండ్‌తో రెండు మ్యాచుల టీ20 సిరీస్‌ కోసం హార్దిక్‌ పాండ్య సారథ్యంలోని టీమ్‌ ఇండియా ఈ వారంలోనే బ్రిటన్‌ పర్యటనకు బయల్దేరనుంది.
పంత్‌ ఐదోసారీ..! : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ కోరుకోని రికార్డు సాధించాడు!. సిరీస్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో టాస్‌ కోల్పోయాడు. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా మళ్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌, లేదా కుదించిన ఓవర్ల మ్యాచ్‌ అంచనా వేసి సఫారీ ఈ నిర్ణయం తీసుకుంది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (15, 7 బంతుల్లో 2 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (10, 12 బంతుల్లో 1 ఫోర్‌) దూకుడుగా ఆడారు. కిషన్‌ రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జోరుమీదున్న ఓపెనర్లు ఇద్దరినీ ఆఫ్‌ కట్టర్లతో ఎంగిడి డగౌట్‌కు చేర్చాడు. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌.. 3.3 ఓవర్ల వద్ద మరోసారి ఆటంకం కలిగించింది. అప్పటికి భారత్‌ స్కోరు 28/2. రిషబ్‌ పంత్‌ (1 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (0 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. విరామం లేకుండా వర్షం కురుస్తుండటం, వర్షం ఆగిపోయే సూచనలు లేకపోవటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. 2-2తో సమమైన సిరీస్‌లో ఇరు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచి ట్రోఫీని పంచుకున్నాయి. టీ20 సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన భారత సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు సొంతం చేసుకున్నాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కూత మొదలైంది
వాషింగ్టన్‌కు గాయం
ఆకాశమే హద్దుగా..!
సస్పెన్షన్‌ ముప్పు?
స్వర్ణ యుగం మొదలైంది!
ప్రయోగాలు ఫలించేనా?
ఫిఫా రీ షెడ్యూల్‌ ఇదే!
మళ్లీ బ్యాట్‌ పట్టనున్న గంగూలీ
ఐపీఎల్‌ ఉమెన్స్‌ తొలి సీజన్‌ ముహూర్తం ఖరారు!
కెఎల్‌ రాహుల్‌ ఫిట్‌
కొత్త పంథా!
బెంగాల్‌కు బీసీసీఐ నో!
ఇక పసిడి వేట
రేసులో రజతానందం
రెజ్లర్ల పసిడి పట్టు
రూపాల్‌కు కాంస్యం
రజత శంకర్‌
హైదరాబాద్‌లో భారత్‌, ఆసీస్‌ టీ20
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌?
సూర్య నం.2
రిలే రేసులో రజతం
షట్లర్ల సిల్వర్‌ షో
లాన్‌ బౌల్స్‌లో నవ చరిత్ర
28న భారత్‌, పాక్‌ ఢీ
సమం చేశారు!
మంధాన నం.3
పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన!
లాన్‌బాల్‌లో మహిళల నయా చరిత్ర
కామన్వెల్త్‌ గేమ్స్‌ - 2022
నార్వేకు షాక్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.