Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట టౌన్, రూరల్
అండర్-19 జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో హర్యానా జట్లు విజేతలుగా నిలిచాయి. టెన్నికాయిట్లో తమిళనాడు ట్రోఫీని కైవసం చేసుకుంది. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం జరిగిన ఫైనల్స్లో... కబడ్డీ మహిళా విభాగంలో మహారాష్ట్ర-హర్యానా మధ్య హోరాహోరిగా సాగిన మ్యాచ్లో హర్యానా విజయం సాధించింది. పురుష విభాగంలో ఉత్తర్ప్రదేశ్-హర్యానా జట్ల మధ్య జరిగిన పోరు సైతం ఇదే రకంగా సాగింది. చివరకు హర్యానా జట్టు విజ యాన్ని దక్కించుకుంది. మహిళా విభాగంలో ఉత్తరప్రదేశ్ (ద్వితీయ), ఢిల్లీ (తృతీయ), ఆంధ్రప్రదేశ్ (4వ స్థానం)లో నిలిచాయి. పురుష విభాగంలో మహారాష్ట్ర (ద్వితీయ), కర్ణాటక (తృతీయ), హిమాచల్ ప్రదేశ్ (4వ) స్థానాలను దక్కించుకున్నాయి.
టెన్నికాయిట్లో తమిళనాడు విజయం
టెన్నికాయిట్ ఫైనల్లో తమిళనాడు, కేరళ జట్లు తలపడగా..తమిళనాడు జట్టు విన్నర్గా నిలిచింది. కేరళ(ద్వితీయ), పుదుచ్చేరి(తృతీయ), తెలంగాణ(నాలుగో) స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.