Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దు ముప్పు తప్పించుకున్న చెన్నై, రాజస్థాన్ ప్రాంఛైజీలు
-ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో మొబైల్స్
-బిసిసిఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం
ముంబయి : చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీలు ఐపీఎల్లో రద్దు ముప్పు నుంచి తప్పించుకున్నాయి. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులనే ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ యథాతథంగా సూచించటంతో రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు మాత్రమే ఈ రెండు ప్రాంఛైజీలు దూరం కానున్నాయి. ఐపీఎల్-9ను ఎనిమిది జట్ల ఈవెంట్గా ఉంచటం కోసం రెండేండ్ల కాల వ్యవధికి రెండు కొత్త ప్రాంఛైజీల కోసం త్వరలోనే బిసిసిఐ టెండర్లు పిలువనుంది. 2016, 2017 సీజన్లకు మాత్రమే కొత్త జట్లను పరిమితం చేయటంతో ఐపీఎల్ను ఎనిమిది జట్ల లీగ్గానే కొనసాగించేందుకు బిసిసిఐ మొగ్గుచూపింది. రెండేండ్ల నిషేధం ముగిసన తర్వాత ఐపీఎల్-10 సీజన్కు చెన్నై, రాజస్థాన్ ప్రాంఛైజీలు మళ్లీ లీగ్లోకి రానున్నాయి.
ప్రాంఛైజీ యాజమాన్యం అవినీతి, ఫిక్సింగ్కు నిర్ధారణ ఐతే ఆ ప్రాంఛైజీని రద్దు చేసే సర్వాధికారం బిసిసిఐకి ఉన్నా.. రెండేండ్ల నిషేధంతోనే సరిపెట్టింది. పాల్పడినట్లు ఆదివారం ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో సమావేశమైన బిసిసిఐ వర్కింగ్ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. బిసిసిఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ రెండోమారు బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి వర్కింగ్ కమిటీ సమావేశం ఇదే.
కాంట్రాక్టు గడువుకు రెండేండ్ల ముందే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకున్న అమెరికా శీతల పానియాల కంపెనీ పెప్సీకో స్థానంలో చైనా మొబైల్స్ సంస్థ వివో మొబైల్స్ స్పాన్సర్గా రానుంది. 10 రోజుల్లో వివో సంబంధిత బ్యాంక్ గ్యారంటీ సహా మరికొన్ని లాంఛనాల్ని పూర్తి చేయనుంది. పెప్సీకో ఐదేళ్ల కాలానికి రూ.396 కోట్లకు టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకోగా..తాజా ఒప్పందం విలువ ఇంకా తెలియరాలేదు. బిసిసిఐ స్వదేశీ సిరీస్లకు టైటిల్ స్పాన్సర్గా ఉన్న పేటీఎం..ఐపీఎల్ హక్కుల్ని దక్కించుకుంటుందని భావించినా అనూహ్యంగా వివో మొబైల్స్ కాసుల వర్షం కురిసే లీగ్లోకి ఎంటరైంది. ఆదివారం నాటి వర్కింగ్ కమిటీ సమావేశంలో బిసిసిఐ తీసుకున్న పలు నిర్ణయాలు..
- బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశాన్ని నవం బర్ 9న ముంబయిలో నిర్వహించటం.
- బిసిసిఐ ట్రెజరీ కార్యాలయాన్ని చెన్నై నుంచి ముంబయికి తరలించటం
-బోర్డు అంతర్గత ఆడిటర్గా పి.బి. విజయ రాఘవన్ అండ్ కంపెనీ స్థానంలో గోఖలే అండ్ సాథే నియామకం
- అనుబంధ సంఘాలకు బిసిసిఐ ఇస్తోన్న నిధులను రాష్ట్రాల అసోసియేషన్లు ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయో తెలుసు కునేందుకు స్వతంత్ర ఆడిటర్ ఏజెన్సీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ప్రై.లి నియామకం.
- బోర్డు సభ్యుల విరుద్ధ ప్రయోజనాల అంశంపై బిసిసిఐ రాజ్యాంగంలో సవరణలు చేయాలని నిర్ణయం. ఎజిఎంలో సవరణలు చేయనున్నారు.
- నేషనల్ క్రికెట్ అకాడమీ (బెంగళూర్)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు సంకల్పం. కర్ణాటక ఇండిస్టియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు ఆఫర్ చేసిన స్థలానికి అకాడమీని మార్చే విషయంపై త్వరలో నిర్ణయం. స్థల పరిశీలనకు వెళ్లనున్న అకాడమీ ఛైర్మన్ పండోవ్, రాజీవ్ శుక్లా, అనురిధ్ చౌదరి, అమితాబ్ చౌదరి.
్క టీమ్ ఇండియా దుస్తుల స్పాన్సర్ నైకీ కాంట్రాక్టు పొడగింపు
- బిసిసిఐ నుంచి నెలవారీ ఉచిత సదుపాయాలు పొందుతున్న ఆటగాళ్లు, అంపైర్ల పేర్లు, అందుకున్న మొత్తం వివరాలు వెబ్సైట్లో వెల్లడి.
-క రూ.25 లక్షలకు మించిన లావాదేవీల వివరాలు వెబ్సైట్లో ఉంచటం.