Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివసేన హెచ్చరికతో పాక్ అంపైర్ను
- ఫ్రీడమ్ సిరీస్ నుంచి తప్పించిన ఐసిసి
దుబాయ్ : శివసేన ఎఫెక్ట్ ఐసిసికి తాకింది!. కానీ మూల్యం అంపైర్ చెల్లించాడు!!. భారత్, పాకిస్తాన్ వన్డే సిరీస్ నుంచి పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ను తప్పిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు శశాంక్ మనోహర్ను శివసేన అడ్డుకుంది. పాకిస్తాన్తో దైపాక్షిక సిరీస్పై చర్చలను అడ్డుకున్న శివసేన కార్యకర్తలు ఫ్రీడమ్ వన్డే సిరీస్లో ఆఖరి, ఐదో వన్డేలో పాకిస్తాన్కు చెందిన అంపైర్ అలీమ్ దార్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. అక్టోబర్ 25న భారత్, దక్షిణాఫ్రికా ఐదో వన్డే ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సి వుంది. రాజకీయాలకు, క్రికెట్ సంబంధాలకు ముడిపెట్టవద్దని పేర్కొన్న ఐసిసి..శివసేన హెచ్చరి కలను దృష్టిలో ఉంచుకుని అలీమ్ దార్ను తప్పించింది. వాస్తవానికి బిసిసిఐ..పిసిబి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో దైపాక్షిక సిరీస్ ఆడాల్సి వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తటస్థ వేదిక అబుదాబిలో దైపాక్షిక సిరీస్ జరగని పక్షంలో బంగ్లాదేశ్లో ఆ జట్టుతో కలిసి ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తితో ఉన్నాయి. కానీ క్లిష్లమైన రాజకీయ పరిస్థితులు పాక్-భారత్ సిరీస్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.