Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బార్బడోస్లో జరిగే ఐసిసి బోర్డు సమావేశానికి బిసిసిఐ తరఫున ఎన్. శ్రీనివాసన్ ఎందుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడంటూ క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బిహార్) కార్యదర్శి ఆదిత్య వర్మ బిసిసిఐ ప్రెసిడెంట్ జగ్మోహన్ దాల్మియాను ఒక లేఖలో ప్రశ్నించాడు. ' చెన్నై సూపర్ కింగ్స్, ఇండియా సిమెంట్స్కి ఛైర్మన్తోపాటు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసన్పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. టిఎన్సిఎ ప్రెసిడెంట్గా ఎన్నికవడం పై కూడా సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసిసి సమావేశంలో బిసిసిఐ తరఫున పాల్గొంటూ ఐసిసి బోర్డు ఛైర్మన్గా వ్యవహరించడం కూడా సుప్రీం కోర్డు ఉత్తర్వులకు వ్యతిరేకమే' అని ఆదిత్య వర్మ లేఖలో వెల్లడించారు. ఈ లేఖ ఒక కాపీని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎమ్.లోధాకు పంపించారు.