Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలాండ్పై భారత్ గెలుపు
ఆంట్వెర్స్ (బెల్జియం) : హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్లో భారత్ మంగళవారం జరిగిన మ్యాచ్లో పోలాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఫ్రాన్స్పై గెలిచిన భారత్ అదే జోరును కొనసాగిస్తోంది. మ్యాచ్లో 23వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి తొలి గోల్ చేశాడు. తర్వాత 41వ నిమిషంలో సర్దార్సింగ్, 52వ నిమిషంలో దేవేందర్ వాల్మీకి గోల్స్ చేశారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపుడుతుంది. భారత పురుషుల జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకెళ్తుంటే మహిళల జట్టు మాత్రం వరుస ఓటములు చవిచూస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 5-0 తో ఓడారు. ఇప్పటికే తొలిమ్యాచ్లో బెల్జియం చేతిలో ఓడింది.