Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనీపట్ : హర్యానా స్టీలర్స్పై తెలుగు టైటాన్స్ ఘన విజయం సాధించిం ది. ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ మ్యాచ్లో 18 పాయింట్ల తేడాతో హర్యానా ఓటమి పాలైంది. స్వల్ప ఆధిక్యంతో ద్వితీయార్దంలోకి అడుగు పెట్టిన టైటాన్స్ రైడింగ్, డిఫెన్స్లో అద్భుతంగా రాణించి పాయింట్ల అంతరాన్ని పెంచుకుంటూ పోయింది. రాహుల్ చౌదరి ఒక టాకిల్ సహా పది పాయింట్లు సాధించాడు. విశాల్ భరద్వాజ్ ఆరు టాకిల్స్ చేశాడు. డిఫెన్స్లో ఘోరంగా విఫలమైన హర్యానాను టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేసింది. మరో మ్యాచ్లో పుణెపై బెంగళూరు 24-20తో గెలుపొందింది. రైడర్లు విఫలమైన పోరులో డిఫెండర్లు రాణించి బెంగళూరుకు విజయాన్నిచ్చారు. కుల్దీప్ ఐదు టాకిల్స్, మహేందర్, సునీల్ చెరో నాల్గు టాకిల్స్తో రాణించారు. రైడర్లెవ్వరూ మూడుకి మించి పాయింట్లు సాధించలేదు.