Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్
చెన్నై : ఐపీఎల్ నయా స్టార్స్కు సదవకాశం. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ప్రతిభ చాటేందుకు చక్కని వేదికగా మారనున్నది!. ఐదు వన్డేలు, మూడు టీ20ల కోసం భారత్కు వచ్చిన స్మిత్సేన నేడు చెపాక్లో ప్రాక్టీస్ పోరుతో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నది. ప్రధాన ఆటగా ళ్లందరూ దులీప్ ట్రోఫీలో బిజీగా ఉండటంతో.. యువ ఆటగాళ్లకు ఆసీస్తో ఆడే అవకాశం దక్కింది. గుర్కీరత్ సింగ్ మన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్కు సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, నితీశ్ రానా, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మలు నేటి మ్యాచ్లో బరిలోకి దిగనున్నారు. ప్రధానంగా నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, సందీప్ శర్మల ప్రదర్శనపై ఆసక్తి నెలకొన్నది. ఉపఖండంలో ఆట అంటేనే స్పిన్ ఫోబియోతో బెంబేలెత్తే కంగారూలు నేటి ఆటలోనూ స్పిన్ను ఏ విధంగా ఆడతారనేది ఆసక్తికరం. కెప్టెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్ సహా అరోన్ ఫించ్, మాక్స్వెల్లు ప్రాక్టీస్ నుంచే ఫామ్ కొనసాగించాలని ఆశిస్తున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా, ట్రావిశ్ హెడ్ సహా సీమర్లు కమిన్స్, హెజిల్వుడ్లు సానుకూల ఆరంభంపై దృష్టి సారిం చాడు. ఆల్రౌండర్ జేమ్స్ ఫాల్క్నర్ బంతితో, బ్యాట్ తోనూ రాణించాలనే దృక్పథంతో కనిపిస్తున్నాడు. చెపాక్లో నేడు ఉదయం 10 గంటలకు బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో ఆస్ట్రేలియా తలపడనున్నది.