Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయయాత్ర కొనసాగింపుగా కోహ్లిసేన
- పట్టుదలగా కనిపిస్తోన్న ఆస్ట్రేలియా
- ఆసీస్తో భారత్ తొలి వన్డే నేడు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
అగ్రజట్ల ఆధిపత్య పోరుకు రంగం సిద్ధం. పరుగుల ప్రవాహం పోటెత్తనున్న పరిమిత ఓవర్ల సిరీస్లో సొంతగడ్డపై విజయయాత్ర కొనసాగించాలని కోహ్లిసేన భావిస్తోంది. ఏడాది ఆరంభంలో టెస్టుల్లో ఓడినా, ఇప్పుడు వన్డేల్లో ఎలాగైనా నెగ్గాలనే తపనతో కంగారూ శిబిరం కసితో ఉంది. ఆస్ట్రేలియా, భారత్లలో విధ్వంసక బ్యాట్స్మెన్కు కొదవ లేదు. దీంతో పోటీ రసవత్తరంగా సాగనున్నది. ఐదు వన్డేల సవాల్లో చెపాక్లో తొలి పరీక్షకు
వెళ్తున్నాయి ఆసీస్, భారత్లు.
నవతెలంగాణ-చెన్నై
విదేశాల్లో ఇటీవల వన్డే రికార్డు ఆసీస్ను కంగారు పెడుతోంది. విదేశీ గడ్డపై ఆడిన గత ఎనిమిది మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియాకు పరాభవం తప్పలేదు. చివరగా 2016లో ఐర్లాండ్పై సాధించిన విజయమే ఆసీస్కు ఆఖరు గెలుపు. ఇదే సమయంలో మరోవైపు టీమ్ ఇండియాది వన్డేల్లో తిరుగులేని ప్రస్థానం. గత 15 మ్యాచుల్లో కేవలం మూడింటిని మాత్రమే కోల్పోయింది. ఆ మూడు మ్యాచులు విదేశీ గడ్డపై ఆడినవే కావటం గమనార్హం. సొంతగడ్డపై అజేయ రికార్డుతో దూసుకెళ్తోన్న కోహ్లిసేన.. తాజా వన్డే సిరీస్లోనూ అదే జోరు చూపించేందుకు సిద్ధమవుతోంది. 2019 ప్రపంచకప్ సన్నాహక కోణంలోనే ఆసీస్తో సిరీస్ను చూస్తోన్న జట్టు మేనేజ్మెంట్ యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించనున్నది. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్పై మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెందర్ చాహాల్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఆసక్తికరం. బలబలాల పరంగా టీమ్ ఇండియా హాట్ ఫేవరేట్ కానీ ఆడుతున్నది ఆస్ట్రేలియాతో కాబట్టి ఫలితం కోసం ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.
మిడిల్లో మారాలి : భారత జట్టులో అంతా బాగానే కనిపిస్తున్నా, ఆందోళన చెందాల్సిన అంశాలూ ఉన్నాయి. శిఖర్ ధావన్ దూరం కావటంతో రహానె ఓపెనర్గా రానున్నాడు. ఆధునిక క్రికెట్ అవసరాల మేరకు అజింక్య దూకుడుగా పరుగులు చేయగలడా అని సందేహం. ఇక మిడిల్ ఆర్డర్లో లోకేశ్ రాహుల్ నిరాశపరిచాడు. శ్రీలంకలో వరుసగా విఫలమయ్యాడు. మనీశ్ పాండే మరిచిపోలేని ప్రదర్శన చేసినా.. కెప్టెన్, కోచ్లు రాహుల్కు మళ్లీ అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కేదార్ జాదవ్ ఫినీషర్ పాత్రలో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఆసీస్తోనూ అతడి ముగింపు నైపుణ్యాలకు సానపట్టే కార్యక్రమం ఉండనున్నది. యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలు లేని వేళ నాల్గో స్థానంలో నిలకడగా ఆడే ఆటగాడు దొరకలేదు. రాహుల్, మనీశ్, కేదార్లలో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేయగలమని నిరూపించుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియాపై తిరుగులేని రికార్డు ఉన్న రోహిత్ శర్మ, సెంచరీలతో హోరెత్తిస్తున్న విరాట్ కోహ్లిలు బ్యాటింగ్ లైనప్లో ప్రత్యేకం. ఆఖర్లో ఎం.ఎస్ ధోని మెరుపుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బంతితో భువనేశ్వర్ కుమార్, జశ్ప్రీత్ బుమ్రాలు జోడీ నెం.1గా ఉన్నారు. యువ స్పిన్నర్ల సైతం అంచనాలను అందుకునేలా కనిపిస్తున్నారు.
బలహీన బౌలింగ్! : బ్యాట్తో భారత్కు సరి జోడీగా ఉన్న ఆస్ట్రేలియా.. బంతితో పూర్తిగా తేలిపోతుంది. పస లేని పేస్, ప్రభావరహిత స్పిన్తో కోహ్లిసేనను నిలువరించటం కంగారూలకు సాధ్యపడేది కాదు. కానీ ప్రమాదకర బ్యాట్స్మన్ డెవిడ్ వార్నర్ భారత్కు ప్రధాన ముప్పు. అతడిని పవర్ ప్లేలోనే వెనక్కి పంపకుంటే జరిగే అనర్థాలు ఊహించలేం.
కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాక్స్వెల్, ట్రావిశ్ హెడ్, మాథ్యూ వేడ్లు బ్యాట్తో విధ్వంసం సృష్టించ గలరు. మాక్స్వెల్ స్పిన్ నైపుణ్యం అండతో ఆసీస్ ఒక్క స్పిన్నర్తోనే బరిలోకి దిగే అవకాశం కనిపి స్తోంది. బంతితో బలహీనంగా కనిపిస్తోన్న ఆస్ట్రే లియా.. బ్యాట్తోనే పోరాటం చేయాలని వ్యూహి స్తోంది. మరి, అందుకు భారత బౌలింగ్ బృందం అవకాశమిస్తుందా అనేది ప్రశ్నార్థకం.
మూడంకెల స్కోరు కోసం నేను ఆడను. అందుకే కాబోలు ఎక్కువ సెంచరీలు చేయగలిగాను. 98, 99తో నాటౌట్ అయినా నేను లెక్కచేయను. అప్పుడు జట్టు విజయం సాధిస్తే చాలు, అందుకోసమే ఆడేది. ప్రత్యర్థిపై మాటల దాడి చేయాలంటే, రోజంతా కూర్చుని మాట్లాడవచ్చు. మాటల యుద్ధం అంతా మైండ్ గేమ్. మైదానంలో ఆడకుంటే ఇవన్నీ పనిచేయవు. అయితే, ఇది ఉంటే అభిమానుల్లో మ్యాచ్పై ఆసక్తి పెరుగుతుందని అనుకుంటున్నాను'
విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ తుది జట్లు (అంచనా)
భారత్ : అజింక్య రహానె, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే/లోకేశ్ రాహుల్, కేదార్ జాదవ్, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్్, కుల్దీప్ యాదవ్, యుజ్వెందర్ చాహాల్, జశ్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, ట్రావిశ్ హెడ్, స్టీవెన్ స్మిత్, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, జేమ్స్ ఫాల్క్నర్, నాథన్ కౌల్టర్నైల్, పాట్ కమిన్స్, ఆడం జంపా.
పిచ్, వాతావరణం
చెపాక్ స్టేడియం ఆరంభంలో బ్యాటింగ్కు సహకరిస్తుంది.
ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 264. కానీ దూకుడుగా ఆడగల బ్యాట్స్మెన్ ఉంటే 300 ప్లస్ స్కోరు సునాయసంగా సాధించవచ్చు. నేడు మధ్యాహ్నం చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ మ్యాచ్కు వచ్చిన ప్రమాదమేమీ లేదనే చెప్పవచ్చు!.
2013 నుంచి ఆసీస్, భారత్ మధ్య వన్డేల్లో సగటు
321 తొలి ఇన్నింగ్స్ స్కోరు 321. తాజా సిరీస్లోనూ పరుగుల వరద ఎదురుచూస్తోంది.
1104 ఆస్ట్రేలియాపై 13 మ్యాచుల్లోనే రోహిత్ శర్మ బాదిన పరుగులు 1104. ఏకంగా 110.4 సగటు, 102.88 స్ట్రయిక్రేట్తో రోహిత్ కంగారూలను ఉతికారేశాడు.