Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్పై టీమ్ఇండియా గెలుపు
- అర్థ సెంచరీతో ఆదుకున్న ధోని
- సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు
నవతెలంగాణ- చెన్నై
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్ అజింక్య రహానె (5)లు ఆరంభంలోనే వెనుదిరిగాడు. నాల్గో ఓవర్లో నైల్ వేసిన బంతిని మాథ్యూ వేడ్ అందుకోవడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (28, 44 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు తీయడానికి అవస్థపడ్డాడు. మూడో స్థానంలో వచ్చిన కోహ్లి నాలుగు బంతుల్లోనే డక్ అవుట్ చేసిన కౌల్టర్ నైల్ ఆ వెనకే నాల్గో స్థానంలో వచ్చిన మనీశ్ పాండేను సైతం డక్ అవుట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులతో భారత్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కేదార్ జాదవ్ (40, 54 బంతుల్లో 5 ఫోర్లు), మరో ఓపెనర్ రోహిత్ శర్మకు అండగా నిలబడ్డాడు. వీరిద్దరు నాల్గో వికెట్కు 68 పరుగులు జోడించారు. 16వ ఓవర్లో స్టోయినీస్ వేసిన ఆఖరు బంతికి కౌల్టర్ నైల్కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఆరో స్థానంలో క్రీజులోకొచ్చిన ధోని కూల్గా ఆడటం మొదలు పెట్టాడు. ఒకటి అరా పరుగులు చేస్తూ వికెట్ను కాపాడే ప్రయత్నం చేశాడు. మరో పక్క క్రీజులో నిలబడతాడుకున్న కేదార్ జాదవ్ 22వ ఓవర్లో స్టోయినీస్ వేసిన బంతిని కొట్టబోయి మిడ్ వికెట్ దగ్గర కాచుకున్న కార్టర్ రైట్ చేతికి చిక్కాడు. హార్దిక్ పాండ్య వచ్చీ రాగానే పరుగుల వరద పారించాడు. ఐదు ఫోర్లు, ఐదు సిక్స్లతో చెలరేగి.. అప్పటి దాకి భారత బ్యాట్స్మన్ను బెంబెలెత్తించిన ఆసీస్ బౌలర్లకు షాకిచ్చాడు. వన్డే మ్యాచ్లో టి20 తరహా ఆటతీరుతో మెరిసాడు. మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనితో కలసి భారత్కు 103 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 48 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న పాండ్య, ఆపై దూకుడు పెంచాడు. 66 బంతుల్లోనే 83 పరుగులు చేసి ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్న పాండ్య.. ఆడం జంపా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి జేమ్స్ ఫాల్క్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 బంతుల దూరంలో శతకం మిస్సయ్యాడు. పాండ్య అవుట్ అవ్వటంతో బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్ (32, 30 బంతుల్లో 5 ఫోర్లు) ఓ ఎండ్లో ధోని చెలరేగడానికి దోహదం చేశాడు. 41 ఓవర్లలో టీమిండియా స్కోరు 205/6 కాగా.. చివరి నిమిషాల్లో చెలరేగిన ధోని (79, బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) స్కోరు బోర్డును ఉరికించాడు. పల్లెకెలెలో లంకతో ఆడిన రెండో వన్డే గుర్తు తెప్పించాడు. మహి మెరుపులు చూస్తే స్కోరు 300 తాకేలా అనిపించింది. మరో రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా ఫాల్క్నర్లో బౌలింగ్లో లాంగ్ ఆఫ్ వద్ద డెవిడ్ వార్నర్ చేతికి చిక్కాడు. కుల్దీప్ యాదవ్ (0, నాటౌట్) క్రీజులో నిలిచాడు. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 281 పరుగులు చేసింది. తొలి మూడు వికెట్లు నాథన్ కౌల్టర్ నైల్ ఖాతాలో పడ్డాయి. స్టోయినిస్ రెండు, ఫాల్క్నర్ ఒక వికెట్ పడగొట్టారు.
వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్ ఆలస్యం కావటంతో 21 ఓవర్లకి మ్యాచ్ కుదించి, లక్ష్యం 164 పరుగులుగా నిర్దేశించారు. ఛేదనలో తడబడ్డ కంగారూలు వరుసగా వికెట్లు కోల్పోయారు. వార్నర్ (25), మాక్స్వెల్ (39), ఫాల్క్నర్ (32 నాటౌట్) మినహా మిగతా బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆసీస్ టాప్ ఆర్డర్ సైతం విఫలం అయ్యింది. చాహాల్ మూడు వికెట్లు తీసాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యలు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, భువనేశ్వర్లు చెరో వికెట్ తీసుకున్నారు.
భారత్ : రహానె (సి) వేడ్ (నైల్) 5, రోహిత్ (సి) నైల్ (బి) స్టోయినిస్ 28, కోహ్లి (సి) మాక్స్వెల్ (బి) నైల్ 0, మనీశ్ (సి) వేడ్ (బి) నైల్ 0, కేదార్ (సి) కార్ట్వైట్ (బి)స్టోయినిస్ 40, ధోని (సి) డెవిడ్ (బి) ఫాల్క్నర్ 79, పాండ్య (సి)ఫాల్క్నర్ (బి) జంపా 83, భువనేశ్వర్ నాటౌట్ 32, కుల్దీప్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు 14, మొత్తం 281/7
బౌలింగ్ : భువనేశ్వర్ 1/25, బుమ్రా 1/20, పాండ్య 2/28, కుల్దీప్ 2/33, చాహాల్ 3/30
ఆస్ట్రేలియా : వార్నర్ (సి) ధోని (బి) కుల్దీప్ 25, కార్ట్రైట్ (బి) బుమ్రా 1, స్మిత్ (సి) బుమ్రా (బి) పాండ్య 1, హెడ్ (సి) ధోని (బి) పాండ్య 5, మాక్స్వెల్ (సి) మనీశ్ (బి) చాహాల్ 39, స్టోయినిస్ (సి) జడేజా (బి) కుల్దీప్ 3, వేడ్ (స్టం) ధోని (బి) చాహాల్ 9, కమిన్స్ (సి) బుమ్రా (బి) చాహాల్ 9, నైల్ (సి) కేదార్ (బి) భువనేశ్వర్ 2, ఫాల్క్నర్ నాటౌట్ 32, జంపా నాటౌట్ 5, ఎక్స్ట్రాలు 6, మొత్తం 137/9
బౌలింగ్ : కౌల్టర్ నౌల్ 3/44, ఫాల్క్నర్ 1/67, స్టోయినిస్ 2/54, జంపా 1/66