Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోటు నిలుపుకున్న శిఖర్ ధావన్
- షమి, ఉమేశ్లపై వేటు
- కివీస్తో వన్డేలకు భారత జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి
మిషన్ 2019 ప్రపంచకప్ దారిలోనే సీనియర్ సెలక్షన్ కమిటీ సాగుతోంది. వరుసగా మూడో కీలక సిరీస్కు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను పక్కపెట్టింది. నిలకడగా ఆడుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్కు వన్డే జట్టులో చోటు ఇచ్చిన ఎమ్మెస్కే బృందం.. యువ స్పిన్ త్రయానికి అవకాశాలు పొడగిం చింది. న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు శనివారం భారత జట్టును ప్రకటిం చారు. శ్రీలంక సిరీస్లో విఫలమై, ఆసీస్తో తుది జట్టులో లేని లోకేశ్ రాహుల్కు సెలక్టర్లు మొండిచెయ్యి చూపారు. సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను యథావిధిగా సెలక్టర్లు విస్మరించారు. భార్య అనారోగ్యం కారణంతో ఆసీస్తో తొలి మూడు వన్డేల నుంచి తప్పుకున్న శిఖర్ ధావన్, తర్వాతి రెండు వన్డేలకు జట్టులోకి రాలేదు. కానీ కివీస్తో సిరీస్కు గబ్బర్ తిరిగొచ్చాడు. ఆసీస్పై ఓపెనర్గా ఆకట్టుకున్న అజింక్య రహానె సైతం జట్టులో ఉన్నాడు. మనీశ్ పాండే, కేదార్ జాదవ్లపై సెలక్టర్లు మరోసారి నమ్మకముం చారు. బౌలింగ్ విభాగంలో బెంగళూర్ వన్డేలో విఫలమైన మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్లను సెలక్టర్లు పక్కనపెట్టారు. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చిన వీరిద్దరని కొనసాగించలేదు. భువనేశ్వర్ కుమార్, జశ్ప్రీత్ బుమ్రాలకు యువ సీమర్ షార్దుల్ ఠాకూర్ తోడు కానున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహాల్లు చోటు నిలుపుకున్నారు. యువ ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ ప్రమోషన్ ఇవ్వలేదు. రిషబ్ పంత్, శ్రేయాష్ అయ్యర్లను ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ వాంఖడేలో 22న తొలి మ్యాచ్తో ఆరంభం కానున్నది.
వన్డేలకు భారత జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అజింక్య రహానె, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎం.ఎస్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహాల్, జశ్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షార్దుల్ ఠాకూర్.