Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూ కాశ్మీర్పై సౌరాష్ట్ర భారీ విజయం
- జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన
రాజ్కోట్ :రంజీ మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్ ఒక్క రోజులోనే ఏకంగా 16 వికెట్లు కోల్పోయింది. సౌరాష్ట్ర స్పిన్నర్ల ధాటికి రాజ్కోట్లో విలవిల్లాడిన జమ్మూ కాశ్మీర్ మూడో రోజులోనే చేతులెత్తేసింది. సౌరాష్ట్ర ఏకపక్ష విజయానికి దారినిచ్చింది. 103/4తో బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకే కుప్పకూలింది. జడేజా (4/40), మరో లెఫ్మార్మ్ స్పిన్నర్ ధర్మేంద్రసిన్హా జడేజా (6/68) విజృంభించారు. ఫాలోఆన్లో ఆఫ్స్పిన్నర్ జివ్రజని (6/79) మెరవటంతో జమ్మూ కాశ్మీర్ 256 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా (201) డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర 624 పరుగుల భారీ స్కోరు చేయటంతో జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ 212 పరుగులతో ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కేరళతో మ్యాచ్లో గుజరాత్ గెలుపు దిశగా పయనిస్తోంది. కేరళ వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో 209, 203లకే కుప్పకూలింది. గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 22/1తో కొనసాగుతోంది. నేడు మరో 83 పరుగులు చేస్తే గెలుపు గుజరాత్ సొంతమవనున్నది. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మధ్య జరగాల్సిన రంజీ మ్యాచ్ తడి పిచ్ కారణంగా మూడో రోజూ ఆరంభం కాలేదు.