Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుణె : స్వదేశంలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత టెన్నిస్ క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. మూడో సీడ్ యుకీ బాంబ్రీ, నాల్గో సీడ్ రామ్కుమార్ రామనాథన్ సహా విజరు సుందర్ ప్రశాంత్, సుమిత్ నాగల్లు ప్రీ క్వార్టర్స్లో అడుగు పెట్టారు. క్వార్టర్స్ బెర్త్ కోసం నేడు సుమిత్ నాగల్ రెండో సీడ్ అడ్రియన్ మెనెండెజ్ మసైరస్ (స్పెయిన్)తో తలపడనుండగా, టోర్నీ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగు తేజం సాకేత్ మైనేని సెర్బియా ఆటగాడు పెడా కిరిస్టిన్తో తలపడనున్నాడు. అన్ సీడెడ్ ప్రశాంత్ టాప్ సీడ్ బ్లేజ్ కావ్చిక్ను ఎదుర్కోనున్నాడు. డబుల్స్లో మైనేని, జీవన్ల జోడీ మరో భారత జంట బాలాజీ, వర్థన్లతో ప్రీ క్వార్టర్స్ బరిలో తలపడనున్నారు.