Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈడెన్ గార్డెన్స్ పేస్ బౌలర్లకు స్వర్గధామం. తొలి నుంచీ ఈడెన్ పిచ్ శైలి పేస్ కాదు. 2016లో ఈడెన్ గార్డెన్స్ పిచ్ను పూర్తిగా మార్చేశారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేసన్ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నాక ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్నుంచి ఇక్కడ వికెట్ల వేటలో హవా సీమర్లదే. ఇక్కడ న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో స్వింగ్ స్టార్ భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో 40 వికెట్లలో ఏకంగా 26 వికెట్లు సీమర్లకు దక్కాయి. ఇక ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్లోనూ భువి ఇక్కడ మెరిశాడు. పిచ్ సానుకూలతను సొమ్ముచేసుకుని కంగారూలను ఓటమి బాట పట్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఇదే ఒరవడి. పేస్ బౌలర్లు 16 ఇన్నింగ్స్ల్లో నాల్గు, అంతకంటే ఎక్కువ వికెట్లు కూల్చగా, స్పిన్నర్లు కేవలం నాల్గు పర్యాయాలు మాత్రమే ఆ మార్క్ అందుకోగలిగారు. అందుకే శ్రీలంకతో తొలి టెస్టుకు సైతం భారత్ ముగ్గురు సీమర్లతో ఆడేందుకు మొగ్గుచూపుతోంది.
హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వటంతో ఆశ్చర్యపోయా. ఈ వయసులోనే బిజీ క్రికెట్ ఆడగలిగేది. ఇతర పిచ్లతోపోల్చితే ఈడెన్గార్డెన్స్ భిన్నం . అందుకే ఇక్కడ టీమ్ ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడదు. హార్దిక్ పాండ్య జట్టులో లేకపోవటంతో తుది జట్టులో ఆల్రౌండర్ స్థానం కోసం
కాస్త విభిన్నమైన కాంబినేషన్ను ప్రయత్నించే వీలున్నది'
- సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్