Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో హైదరాబాదీ షట్లర్లు
- తొలి రౌండ్లో ప్రణరు గెలుపు
- డబుల్స్లో భారత్కు నిరాశ
ఫూజౌ (చైనా) : చైనా ఓపెన్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచుల్లో నెగ్గి ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టారు. తాజా జాతీయ సీనియర్ చాంపియన్షిప్ విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై 21-12, 21-13తో అలవోక విజయం సాధించింది. రెండో సీడ్గా బరిలోకి దిగిన తెలుగు తేజం పి.వి సింధు సయాక సటో (జపాన్)ను 24-22, 23-21తో ఓడించింది. ఇండోనేషియా ఓపెన్ విజయంతో జోరుమీదున్న సయాక, సింధుకు గట్టిపోటీనిచ్చింది. పురుషుల సింగిల్స్ సర్య్కూట్లో హెచ్.ఎస్ ప్రణరు ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించాడు. లీ డాంగ్క్యూన్ (కొరియా)పై 18-21, 21-16, 21-19తో గెలుపొందాడు.
సైనా దూకుడుగా.. అరగంటలోపే మ్యాచ్ ముగించిన సైనా ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలో 0-1తో వెనుకబడినా 9-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 10-11తో సయాక పోటీలోకొచ్చినా సైనా ధాటికి నిలువలేకపోయింది. చివరిదాకా దూకుడుగా ఆడిన సైనా 21-12తో తొలి సెట్ సొంతం చేసుకున్నది. రెండో సెట్ను సైతం నెమ్మదిగా ఆరంభించిన హైదరాబాదీ 7-5తో ఆధిక్యం చేజిక్కించుకున్నాక జోరు పెంచింది. 21-13తో రెండో సెట్ నెగ్గింది. క్వార్టర్స్లో స్థానం కోసం అకానె యమగూచి (జపాన్)తో తలపడనున్నది. పి.వి సింధు సయాక సటోలు నువ్వానేనా అన్నట్టుగా తలపడటంతో రెండు సెట్లలోనూ పలుమార్లు ఆధిక్యం చేతులు మారింది. అయితే గేమ్ పాయింట్లు నెగ్గటంలో అనుభవశాలి సింధు 59 నిమిషాల పోరులో స్వల్ప పాయింట్ల తేడాతో సెట్లు నెగ్గి ప్రీ క్వార్టర్స్లో కాలుమోపింది. తదుపరి పోరులో హాన్ యూ (చైనా)ను ఎదుర్కోనున్నది. ప్రణరు తొలి సెట్ ఓడినా రెండో సెట్లో పుంజుకున్నాడు. నిర్ణాయక సెట్లో నిలకడగా రాణించి పురుషుల సింగిల్స్లో భారత్ ఆశలు సజీవంగా నిలిపాడు. సౌరభ్ వర్మ బ్రైస్ లెవర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో 14-21, 21-15, 11-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. డబుల్స్ అన్ని విభాగాల్లో భారత్ జోడీలు ఓటమి పాలయ్యాయి.