Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : శ్రీలంకతో టీమ్ ఇండియా మళ్లీ ఓ సిరీస్లో తలపడనున్నది. వచ్చే ఏడాది మార్చిలో ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు భారత్ ఆడనున్నది. శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చి, 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ముక్కోణపు సిరీస్ను ఏర్పాటు చేశారు. గతంలో 50 ఏండ్ల సంబురాలకు సైతం ముక్కోణపు వన్డే సిరీస్ నిర్వహించగా న్యూజిలాండ్, భారత్లు పాల్గొన్నాయి. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే కోహ్లిసేన మళ్లీ శ్రీలంకతో ఆడుతుందని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ సైతం వెల్లడించారు.