Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోపింగ్ పరీక్షల వివాదంపై వాడా
న్యూఢిల్లీ : భారత క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే అధికారం నాడా (నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ)కి లేదనే బీసీసీఐ వాదనను వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) తిరస్కరించింది. ' భారత్లోని అథ్లెట్లు, క్రికెటర్లకు డోప్ పరీక్షలు చేసే అధికారం భారత నాడాకు ఉన్నది. బీసీసీఐ జాతీయ క్రీడా సమాఖ్య కాకపోయినా, భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎవరికైనా పరీక్షలు నిర్వహించే అధికారం నాడా సొంతం' అని వాడా తెలిపింది. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రికకు పంపిన ఈమెయిల్ స్పందనలో పేర్కొన్నది. భారత్ స్వతంత్య్ర డోపింగ్ పరీక్షలు అంగీకరించమని, ఐసీసీ నిబంధనలు మాత్రమే పాటిస్తాం.. వాడా రూల్స్ కాదు అనే వాదనను సైతం వాడా తీవ్రంగా తప్పుబట్టింది. వాడాతో ఐసీసీ ఒప్పందం ప్రకారమైనా, బీసీసీఐ పరీక్షలకు అంగీకరించాలి. ఈ విషయంలో కేంద్ర క్రీడా శాఖ జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఈ వివాదంలోకి ఐసీసీని లాగే ప్రయత్నం చేస్తోంది. బీసీసీఐ వైఖరిపై ఐసీసీ, వాడాలు తేల్చుకోవాలనే ధోరణితో క్రీడా శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. భారత క్రికెటర్లకు నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహించకపోతే, భారత నాడా గుర్తింపు రద్దు చేస్తామని ఇటీవల వాడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ వరుస పరిణామాలు ఆసక్తిరేపుతున్నాయి. న