Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్రికెట్ ఒలింపిక్ క్రీడగా ఎదగడానికి మరిన్ని దేశాల్లో క్రికెట్ విస్తృతి జరగాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో 105 సభ్య దేశాలుండగా అందులో కేవలం 12 మంది మాత్రమే పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కలిగి ఉన్నావయి. ఈ పరిస్థితి మారితే 2024 ఒలింపిక్ గేమ్స్లో క్రికెట్ను చేర్చే అవకాశముంటుందని వీరూ వివరించాడు. స్విట్జర్లాండ్ తదితర (ఐసీసీలో సభ్యత్వం లేని) దేశాలకు క్రికెట్ను పరిచయం చేయటం ద్వారా ఐసీసీ పని సులువవుతుందన్నాడు. ఐసీసీలో సభ్యత్వం లేకపోయినా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8, 9 తేదీలలో స్విస్ గడ్డపై ఐస్ క్రికెట్ను నిర్వహించనున్నారు. మహేల జయవర్దనే, షోయబ్ అక్తర్, డానియెల్ వెటోరి, మహ్మద్ కైఫ్లతో పాటు వీరూ స్విట్జర్లాండ్లో క్రికెట్ ఆడనున్నాడు.