Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల యూత్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్
గౌహతి : స్థానిక బాక్సర్ బోరో అంకుషిత (64 కిలోల విభాగం) సహా మరో ముగ్గురు భారత బాక్సర్లు తొలి రోజు సెమీస్ బరిలో దిగనున్నారు. మొత్తంగా పది విభాగాల్లో నేడు సెమీస్ మ్యాచులు జరుగుతాయి. ఫ్లై వెయిట్ విభాగంలో జ్యోతి గులియా, జాన్సాయ ( కజకిస్తాన్)తో తలపడనున్నది. 57 కిలోల విభాగంలో శశి చోప్రా మోంగర్ నమూన్ (మంగోలియా)ను ఢ కొట్టనున్నది. తాయిలాండ్ బాక్సర్ శాక్రితో అంకుషిత అమీతుమీ తేల్చుకోనుండగా.. నేరుగా సెమీస్ చేరిన నేహా యాదవ్ (ప్లస్ 80 కిలోల విభాగం) దినా ఇస్లాంబెకొవా (కజకిస్తాన్)తో తలపడనున్నది.