Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్, ఇంగ్లాండ్ మూడో టెస్టు నేటి నుంచే
పెర్త్ : 135 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టులు ముగిశాయి. ఆతిథ్య ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ విజయం ముంగిట నిలిచింది. ఆస్ట్రేలియా పెర్త్లోనే సిరీస్ సొంతం చేసుకుంటుందా? ఇంగ్లాండ్ పుంజుకునే అవకాశం ఉందా? అనే క్రికెటింగ్ విశ్లేషణలకు తోడు పెర్త్ క్రికెట్ స్టేడియం సైతం చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే యాషెస్తో మొదలైన పెర్త్ ప్రస్థానం మరో వారంలో ముగియనున్నది. అవును, ఆధునిక క్రికెట్లో స్టేడియాలు వినోద వేదికలుగా మారటంతో పురాతన పెర్త్కు ఆదరణ తగ్గింది. దీంతో అత్యాధునిక హంగులతో పెర్త్లోనే కొత్త స్టేడియాన్ని నిర్మించారు. ఇక నుంచి పెర్త్లో జరిగే అన్ని అంతర్జాతీయ మ్యాచులు అక్కడే జరుగుతాయి. 1970 డిసెంబర్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా యాషెస్ టెస్టుకు తొలి ఆతిథ్యం ఇచ్చిన పెర్త్ వాకా స్టేడియం.. ఆ జట్ల మధ్య టెస్టుతోనే వీడ్కోలు తీసుకోబోతున్నది.
ఇక ఇప్పటికే 2-0తో ముందంజలో నిలిచిన స్మిత్ పెర్త్ విజయంతో యాషెస్పై గురిపెట్టగా, ఇంగ్లాండ్ శిబిరం ఆశావహ దృక్పథంతో కనిపిస్తోంది. వాకాలో ఇంగ్లాండ్కు మెరుగైన రికార్డు లేకపోయినా వీడ్కోలు వేళ అద్భుతంపై రూట్ బృందం కన్నేసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఆట మొదలవ్వనున్నది.