Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు క్రికెట్ ఫార్మాట్ మనుగడపై గంగూలీ
కోల్కత : టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే డై నైట్ టెస్టులను స్వాగతించక తప్పదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. గత నెలలో ఈడెన్లో జరిగిన భారత్, శ్రీలంకల తొలి టెస్టుకు ఆశించిన మేర టికెట్లు అమ్ముడవలేదు. దీనికి విరుగుడుగా బెంగాల్ క్రికెట్ అసోసి యేషన్ సొంత గడ్డపై డై నైట్ టెస్టు జరుప తలపెట్టింది. ఇదే విషయమై గంగూలీ ఓ కార్య క్రమంలోమాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశాడు. 'అది అనివార్యం. ఏదో ఓ రోజు జరగాల్సిందే. గులాబీ బంతితో ఆడు తారు. డే నైట్ ఆట జన రంజకం అవుతుంది' అని వివరించాడు. ఐసీసీ భవిష్య టోర్నీల కార్యా చరణలపై బీసీసీఐ నియమించనున్న వర్కింగ్ గ్రూప్లో కీలక సభ్యుడిగా గంగూలీ ఉండే అవకాశం ఉండటం, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.