Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న భారత్, శ్రీలంక వన్డే సిరీస్ నిర్ణాయకపోరు
విశాఖపట్నం : భారత్, శ్రీలంక జట్లు గురువారం విశాఖపట్నానికి చేరుకున్నాయి. మూడు వన్డేల సిరీస్లోని తుది పోరు ఇక్కడి వై.ఎస్.ఆర్ స్టేడియంలో ఆదివారం జరుగనున్నది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ జనరల్ సెక్రెటరీ సీహెచ్ ఆరుణ్ కుమార్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ డీఆర్ఎం ఎమ్ఎస్ మాథూర్ తదితరులు ఇరు జట్ల క్రికెటర్లకు ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు టీమ్ ఇండియా సాధన చేయనున్నది. సిరీస్లో 1-1తో భారత్, లంకలు సమంగా నిలవటంతో నిర్ణాయక విశాఖ వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సిరీస్ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకుల్లో భారత్ తొలి స్థానం చేరుకునే ఆస్కారమున్నది. కేవలం ఒక్క పాయింటు తేడాతో రెండో ర్యాంకులో కొనసాగుతోన్న భారత్కు తొలి వన్డేలో గెలిస్తే ఇదివరకే అగ్రస్థానం దక్కేది, కానీ ధర్మశాలలో లంక గెలుపొందింది. మొహాలీలో రోహిత్ సారథ్యంలో జయభేరి మోగించిన టీమ్ ఇండియా విశాఖపట్నంలోనూ అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నది.