Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో చెన్ యుఫెరుపై
- 2-0తో విజయం
- ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్
- యమగూచితోనే సింధు పోరు
దుబాయ్ : భారత అగ్రశ్రేణి మహిళా షట్లర్ పి.వి సింధు ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్ సమరంలో చైనా చిన్నది చెన్ యుఫెరును వరుస సెట్లలో మట్టి కరిపించింది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ యుఫెరు సింధుకు కాస్త పోటీనిచ్చినా.. కోర్టులో మెరుపు వేగంతో కదిలే సింధు ముందు తేలిపోయింది. మరో సెమీస్ మ్యాచ్లో రచనాక్ ఇంటనాన్పై గెలుపొందిన అకానె యమగూచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నది. గ్రూప్ ఎ తుది పోరులో సింధు చేతిలో ఘోర పరాజయం పాలైన యమగూచి టైటిల్ ఫైట్లో మరోసారి సింధును ఎదుర్కోనున్నది.
సీజన్ ఆఖర్లో జరిగే మెగా టోర్నీలో భారత్ టైటిల్ ఆశలు మోస్తున్న సింధు, సూపర్ ఫామ్ను కొనసాగించింది. 21-15, 21-18తో యుఫెరును చిత్తు చేసింది. తొలి గేమ్ను 5-0 ఆధిక్యంతో ఆరంభించిన సింధుకు 5-5తో యుఫెరు పోటీలోకొచ్చింది. నువ్వానేనా అన్నట్టుగా ఇరువురు తలపడటంతో పలుమార్లు ఆధిక్యం చేతులు మారింది. 11-11తో స్కోరున్న వేళ పుంజుకున్న సింధు యుఫెరుకు మరోసారి ఆధిక్యం కోల్పోలేదు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన చాలెంజ్ సైతం వినియోగించుకుని సఫలం అయిన హైదరాబాదీ షట్లర్ 21-15తో తొలి గేమ్ నెగ్గింది. రెండో గేమ్ ఆరంభమే పోటాపోటీగా జరిగింది. 1-1, 2-2, 3-3గా పాయింట్ల పట్టిక కదిలింది. వరుసగా నాలుగుుంట్లు నెగ్గి 7-3తో పైచేయి సాధించిన సింధు 15-12వరకు ఆధిక్యాన్ని నిలుపుకున్నది. అయితే సింధు తప్పిదాలతో లాభపడిన చైనా యువతి మరోసారి 15-15, 18-19తో పోటీలోకొచ్చింది. ఒత్తిడిలో నిలకడ కోల్పోకుండా ఆడిన సింధు మూడు వరుస పాయింట్లతో 21-18తో సెట్ నెగ్గి ఫైనల్స్లోకి ప్రవేశించింది.