Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాయాల బారిన పడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ల జాబితా పెరుగుతూనే ఉన్నది. మూడో టెస్టులో గాయపడి తొలి మూడు వన్డేలకు దూరమైన స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్.. తాజాగా మరో గాయంతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐదో వన్డేకు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్లో ఏబీ ఎడమ మోకాలి గాయానికి గురయ్యాడు. కానీ ఫిట్నెస్ పరీక్ష పాసై ఆఖరి రెండు వన్డేల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం గాయం తీవ్రం కావటం, సిరీస్ ముగిసిన వారంలోపే ఆస్ట్రేలియాతో టెస్టులు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు ఏబీకి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోలేదు. డుప్లెసిస్, స్టెయిన్, డికాక్లు గాయాలతో భారత్తో సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే.