Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జోహాన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ కెప్టెన్, ఆల్రౌండర్ క్లైవ్ రైస్ (66) మృతి చెందారు. దక్షిణాఫ్రికా జట్టుకు మొదటి కెప్టెన్గా రికార్డులకెక్కిన ఆయన బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఐదు రోజుల క్రితమే 66వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న క్లైవ్ రైస్ నాలుగు నెలల క్రితమే బెంగళూరులో రోబోటిక్ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. 1991లో భారత్లో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ కోసం పర్యటించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆయన నాయకత్వం వహించారు. అయితే యువకులకు అవకాశాలు కల్పిద్దామనే కారణంతో 1992లో జరిగిన వన్డే ప్రపంచకప్నుంచి సెలెక్టర్లు ఆయనను తప్పించారు.