Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాతో భారత మహిళల రెండో వన్డే నేడు
వదోదర: దక్షిణాఫ్రికా గడ్డపై వీరవిహారం చేసిన అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో పోరులో భారత్ తడబ డింది. ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీసు మ్యాచులు సహా తొలి వన్డే మ్యాచ్లో ఓటమిపాలైంది. నేడు రెండో వన్డేలో హర్మన్ ప్రీత్ సేన ఆస్ట్రేలియా గెలుపొందాలనే ధీమాతో ఉన్నది. మూడు మ్యాచుల సిరీస్పై నేడు గెలుపొంది ఆశలు సజీవం చేసుకోవాలని చూస్తోన్నది.
తొలి వన్డేలో మెరిసిన సుష్మ వర్మ, పూజ వస్త్రాకర్లు నేడు సైతం జోరు కొనసాగించాలి. బౌలర్లు కాస్త పరిణతి కనబర్చితే కంగారూ అమ్మాయిలను కట్టడి చేయటం ఏమంత ఇబ్బంది కాదు.స్వదేశీ పిచ్లపై విదేశీ బౌలర్లకు బ్యాట్స్వుమెన్ త్వరితగతిన వికెట్లు కోల్పో తుండటంతో జట్టు ఫామ్పైనే అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. ఇక సీనియర్ బ్యాట్స్వుమెన్ మిథాలీ రాజ్ లేకపోవ టం జట్టుకు ఆందోళన కల్గించే అంశమే అయినా.. జట్టుపై హర్మన్ ధీమా వ్యక్తం చేసింది. తొలి వన్డేలో చేసిన పొరపాట్ల కు నేటి మ్యాచ్లో ఏమాత్రం తావ్విబోమని ఆమె తెలిపింది.
జులన్ పునరాగనం : వెటరన్ మహిళా సీమర్ జులన్ గోస్వామి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో జరుగనున్న ముక్కోణపు టీ20 సిరీస్కు భారత జట్టులోకి పునరాగమనం చేయనున్నది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్కు ఆమె దూరమైంది. ఈ నెల 22 నుంచి 31 వరకూ ముక్కోణపు టోర్నీ జరుగనున్నది.