Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఇన్నింగ్స్లో విదర్భ 598/3
- ఇరానీ కప్
నాగ్పూర్ : దేశవాళీ క్రికెట్లో రికార్డుల పర్వం లిఖిస్తున్నాడు విదర్భ ఆటగాడు వసీం జాఫర్ (285 బ్యాటింగ్). ఓ పక్క వయసు మీద పడుతోన్న అద్భుతమైన బ్యాటింగ్తో అబ్బురపరుస్తున్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో విదర్భ ఇరానీ పోరులో అజేయ ద్విశతకంతో చెలరేగాడు. ఇరానీ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు ఇరానీ కప్లో వరుసగా ఆరు అర్ధశతకాలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇరానీ కప్లో తొలి రోజు శతకంతో చెలరేగిన జాఫర్.. రెండో రోజు సైతం అదే జోరును కొనసాగించాడు. గణేశ్ సతీష్ (120) సెంచరీతో మెరిశాడు. దీంతో విదర్భ జట్టు అతి భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి అపూర్వ్ వాంఖడే (44 బ్యాటింగ్).. జాఫర్ తోడుగా క్రీజులో కొనసాగుతున్నాడు. విదర్భ మూడు వికెట్ల నష్టానికి 598 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నది.