Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దినేశ్ కార్తీక్ హీరోయిక్ ఇన్నింగ్స్
- ఫైనల్లో బంగ్లాదేశ్పై మెరుపు విజయం
- రాణించిన రోహిత్ శర్మ, మనీశ్ పాండే
- నిదహాస్ ట్రోఫీ టీమ్ ఇండియా వశం
ఆఖరి 12 బంతుల్లో 34 పరుగులు చేయాలి. అప్పుడే జోరందుకు మనీశ్ పాండే సైతం నిష్క్రమించాడు. మరో ఎండ్లో విజరు శంకర్ బంతిని తాకేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఈ దశలో బంగ్లాదేశ్ విజయం లాంఛనమే అనిపించింది. కానీ దినేశ్ కార్తీక్ (29 నాటౌట్, 8 బంతుల్లో 2 ఫోర్లు,3 సిక్స్లు) విధ్వంసక ఇన్నింగ్స్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. ఆఖర్లో హైడ్రామా చోటుచేసుకున్నా.. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని సిక్సర్గా మలిచిన దినేశ్ కార్తీక్ టీమ్ ఇండియాకు మెరుపు విజయాన్ని అందించాడు. ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్పై 4 వికెట్లతో గెలుపొందిన భారత్ నిదహాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నది.
నవతెలంగాణ-కొలంబో
ఉత్కంఠగా సాగిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా మెరుపు విజయం సాధించింది. చేజారిందనుకున్న ట్రోఫీ.. దినేశ్ కార్తీక్ మెరుపులతో మళ్లీ టీమ్ ఇండియా వశమైంది. 167 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ (56, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్) అర్ధ సెంచరీతో లక్ష్యం దిశగా సాగిన భారత్.. మిడిల్ ఓవర్లలో తడబాటుకు గురైంది. ఆఖర్లో మ్యాచ్పై బంగ్లాదేశ్ పట్టు బిగించిన దశలో దినేశ్ కార్తీక్ హీరోయిక్ ఇన్నింగ్స్ భారత్ను విజేతగా నిలిపింది. 8 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు సంధించిన కార్తీక్ ఫైనల్లో సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ షబ్బీర్ రెహమాన్ (77, 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించటంతో 166 పరుగులు చేసింది.
రాణించిన రోహిత్ : స్పిన్కు అనుకూలించిన పిచ్పై 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు మంచి ఆరంభమే అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (56, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్ మెహదిపై విరుచుకుపడ్డ రోహిత్ వేగంగా పరుగులు రాబట్టాడు. మరో ఎండ్లో శిఖర్ ధావన్ ఓ సిక్సర్తో జోరందుకున్నా.. వికెట్ నిలుపుకోలేకపోయాడు. షకిబ్ ఓవర్లో క్యాచౌట్గా నిష్క్రమించాడు. మూడోస్థానంలో వచ్చిన సురేశ్ రైనా (0) నిరాశపరిచాడు. మూడు బంతులాడిన రైనా... పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ సమర్పించుకున్నాడు. కెఎల్ రాహుల్ (24, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను మళ్లీ నిర్మించాడు. దీంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. కానీ వెన్వెంటనే రాహుల్, రోహిత్లు వికెట్ కోల్పోయిన వేళ.. బంగ్లాదేశ్ పట్టు బిగించింది. ఈ తరుణంలో మనీశ్ పాండే (28), విజరు శంకర్ (17)లు వేగంగా పరుగులు చేయటంలో విఫలమయ్యారు. దీంతో సాధించాల్సిన రన్రేట్ సమీకరణం క్లిష్టతరంగా మారింది.
డికె విధ్వంసం : ముస్తాఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో విజరు శంకర్ తొలి నాల్గు బంతులకు ఒక్క పరుగూ చేయలేకపోయాడు. ఐదో బంతికి గానీ సింగిల్ తీయలేకపోయాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని భారీ షాట్ ఆడిన మనీశ్ పాండే క్యాచౌట్గా నిష్క్రమించాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 34 పరుగులకు మారింది. ఈ దశలో టీమ్ ఇండియా విజయం కష్టమే అనిపించింది. కానీ దినేశ్ కార్తీక్ (29 నాటౌట్, 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. వచ్చీ రాగానే వరుసగా ఓ సిక్సర్, ఫోర్, సిక్సర్ కొట్టిన డికె.. తను ఆడిన ఆరు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆఖరి ఓవర్లో 12 పరుగులే అవసరమయ్యాయి. కానీ స్ట్రయిక్ ఎండ్లో విజరు శంకర్ మరోసారి తడబడ్డాడు. తొలి మూడు రెండు బంతుల్లో ఒకే పరుగు చేయగల్గిగాడు (ఓ వైడ్ కూడా వచ్చింది). మూడో బంతికి డికె సింగిల్ తీసుకోగా.. నాల్గో బంతికి విజరు బౌండరీ బాదాడు. దీంతో 2 బంతుల్లో ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి విజరు శంకర్ క్యాచౌట్గా నిష్క్రమించాడు. దీంతో ఆఖరి బంతికి బౌండరీ కొడితే టై, సిక్సర్ సంధిస్తేనే విజయం. ఈ దశలో దినేశ్ కార్తీక్.. సౌమ్య సర్కార్ వేసిన బంతిని అలవోకగా బౌండరీ ఆవల పడేశాడు. కవర్ బౌండరీ దిశగా ఫ్లాట్ సిక్సర్ కొట్టిన కార్తీక్.. భారత్కు ఊహించని విజయాన్ని అందించాడు.
షబ్బీర్ మెరుపులు : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓ సిక్సర్తో హెచ్చరికలు జారీ చేసిన లిటన్ దాస్ (11), ఫామ్లో ఉన్న తమీమ్ ఇక్బాల్ (15)లు ఎంతోసేపు వికెట్ నిలుపుకోలేదు. పవర్ ప్లేలో సాఫీగా సాగుతున్న బంగ్లా ఇన్నింగ్స్ను స్పిన్నర్లు సుందర్, చాహల్లు దెబ్బకొట్టారు. వరుస వికెట్లతో బంగ్లాను వెనక్కి లాగారు. మిడిల్ ఆర్డర్లో సౌమ్య సర్కార్ (1), ముష్ఫీకర్ రహీం (9) సైతం వెన్వెంటనే వికెట్లు కోల్పోయారు. 68/4తో బంగ్లాదేశ్ ఒత్తిడిలో పడింది. కానీ దశలో మూడో స్థానంలో వచ్చిన షబ్బీర్ రెహమాన్ (77, 50 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. ఏడు ఫోర్లు, నాల్గు సిక్సర్లు సంధించిన షబ్బీర్.. బంగ్లా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (7) నిరాశపరిచినా.. షబ్బీర్ జోరు తగ్గలేదు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఆకట్టుకున్నాడు. పేసర్లను లక్ష్యంగా చేసుకొని షాట్లు ఆడిన షబ్బీర్ ఆ దిశగా విజయవంతమయ్యాడు. ఇతడికి మహ్మదుల్లా (21) నుంచి సహకారం లభించింది. పేస్ బౌలింగ్లో పరుగులొచ్చినా.. స్పిన్నర్లు బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. ఆఖరి ఓవర్లో మెహది హసన్ (19) రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (20/1) మరోసారి పరుగుల పొదుపు పాటించాడు. వాషింగ్టన్ ఒత్తిడి పెంచగా.. మణికట్టు స్పిన్నర్ చాహల్ (3/18) వికెట్ల రూపంలో బంగ్లాను పడగొట్టాడు. షార్దుల్ ఠాకూర్ (0/45), విజరు శంకర్ (0/48) ధారాళంగా పరుగులిచ్చారు. ఉనద్కత్ సైతం ఆరంభంలో పరుగులిచ్చినా.. స్లాగ్ ఓవర్లో బంగ్లాను నిలువరించాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : తమీమ్ ఇక్బాల్ (సి) ఠాకూర్ (బి) చాహల్ 15, లిటన్ దాస్ (సి) రైనా (బి) వాషింగ్టన్ సుందర్ 11, షబ్బీర్ రెహమాన్ (బి) ఉనద్కత్ 77, సౌమ్య సర్కార్ (సి) ధావన్ (బి) చాహల్ 1, ముష్ఫీకర్ రహీం (సి) శంకర్ (బి) చాహల్ 9, మహ్మదుల్లా రనౌట్ (కార్తీక్/శంకర్) 21, షకిబ్ అల్ హసన్ రనౌట్ (రోహిత్/శంకర్) 7, మెహిది హసన్ మిరాజ్ నాటౌట్ 19, రూబెల్ హొస్సేన్ (బి) ఉనద్కత్ 0, ముస్తాఫిజుర్ రెహమాన్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166.
వికెట్ల పతనం : 1-27, 2-27, 3-33, 4-68, 5-104, 6-133, 7-147, 8-148.
బౌలింగ్ : జైదేవ్ ఉనద్కత్ 4-0-33-2, వాషింగ్టన్ సుందర్ 4-0-20-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-18-3, షార్దుల్ ఠాకూర్ 4-0-45-0, విజరు శంకర్ 4-0-48-0.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) మహ్మదుల్లా (బి) నజ్ముల్ ఇస్లాం 56, శిఖర్ ధావన్ (సి) అరిఫుల్ హక్) (బి) షకిబ్ 10, సురేశ్ రైనా (సి) ముష్ఫీకర్ రహీం (బి) రూబెల్ హొస్సేన్ 0, కెఎల్ రాహుల్ (సి) షబ్బీర్ రెహమాన్ (బి) రూబెల్ హొస్సేన్ 24 , మనీశ్ పాండే (సి) షబ్బీర్ రెహమాన్ (బి) మస్తాఫిజుర్ రెహమాన్ 28, విజరు శంకర్ (సి) మెహది హసన్ (బి) సౌమ్య సర్కార్ 17, దినేశ్ కార్తీక్ నాటౌట్ 29, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 04, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168.
వికెట్ల పతనం: 1-32, 2-32, 3-83, 4-98, 5-133, 6-162.
బౌలింగ్ : షకిబ్ అల్ హసన్ 4-0-28-1, మెహది హసన్ మిరాజ్ 1-0-17-0, రూబెల్ హొస్సేన్ 4-0-35-2, నజ్ముల్ ఇస్లాం 4-0-32-1, ముస్తాఫిజుర్ రెహమాన్ 4-1-21-1, సౌమ్య సర్కార్ 3-0-33-1.