Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేప్టౌన్ : రెండో టెస్టు సందర్భంగా తనను ఢకొీట్టిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడపై రెండు టెస్టుల నిషేధం ఎత్తివేస్తూ ఐసీసీ అప్పీల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. లెవల్ 2 తప్పిదం ప్రకారం ప్రత్యర్థి ఆటగాడితో భౌతిక దాడికి పాల్పడిన రబాడకు మ్యాచ్ రిఫరీ మూడు డీ మెరిట్ పాయింట్లు అందజేశాడు. కానీ అప్పీల్ కమిషనర్ శిక్షను లెవల్ 2 నుంచి లెవల్ 1 కుదించాడు. దీంతో రబాడ నేటి నుంచి ఆరంభమయ్యే మూడో టెస్టులో ఆడేందుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. ' వీడియో ఫుటేజీల్లో కనిపించిన దానికంటే రబాడ కాస్త గట్టిగానే ఢకొీట్టాడు. ఆస్ట్రేలియా సరైన క్రీడాస్ఫూర్తితో ఆడిందనే అనుకుంటు న్నాను. ఆటలో మా దూకుడు, ఆథిపత్యం అలాగే కొనసాగుతుంది. ఈ నిర్ణయంతో ప్రత్యర్థి ఆటగాళ్లపై భౌతిక దాడికి దిగొచ్చనే తప్పుడు సంకేతం వెలుతుంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయాల పట్ల ఆసీస్ గతంలో భిన్నాబి óప్రాయాలు లేవు. కానీ ఇక నుంచి మా వైఖరిలో మార్పు చోటుచేసుకోవచ్చు' అని స్మిత్ పేర్కొన్నాడు.