Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్యజిత్ ఘోష్పై టేబుల్ టెన్నిల్ ఫెడరేషన్ సస్పెషన్ వేటు వేసింది. ఓ అమ్మాయి సౌమ్యజిత్పై కోల్కత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణనలను సౌమ్యజిత్ ఖండించినా.. తాజా సస్పెన్షన్ వేటుతో ఏప్రిల్ 7 నుంచి ఆరంభమయ్యే కామన్వెల్త్ క్రీడలకు ఘోష్ దూరమయ్యాడు. తాత్కాలిక వేటే అయినా.. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు.